తెలంగాణ సీఎం కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్టైలే వేరు. ప్రజలకు వరాలను ఇవ్వాలన్నా.. వారిని చలోక్తులు, జోకులతో నవ్వించాలన్నా.. ఆయనను మించిన రాజకీయ నాయకుడు లేరు. అందుకనే రెండోసారి ఆయనను సీఎంను చేశారు. అయితే ఆయనకు కోపం వస్తే మామూలుగా ఉండదు. తాజాగా ఓ చోట జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్కు కోపం వచ్చింది. దీంతో ఆయన ఏం చేశారో చూడండి.
తన తనయుడు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో సీఎం కేసీఆర్ తాజాగా పర్యటించారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మండెపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. అయితే అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు, నిర్వాహకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించానికి కత్తెరను ఏర్పాటు చేయడం మరిచిపోయారు.
ఈ క్రమంలో రిబ్బన్ను కట్ చేసి ఇంట్లోకి వెళ్లేందుకు సీఎం కేసీఆర్ కొద్ది సేపు గుమ్మం వద్ద ఆగారు. అయినప్పటికీ కత్తెరను అందించలేకపోయారు. దీంతో కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే రిబ్బన్ను చేత్తో తొలగించి విసిరేసినట్లు పక్కకు వేశారు. కాగా ఆ సమయంలో తీసిన వీడియో వైరల్ గా మారింది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…