లావా మొబల్స్ సంస్థ లావా జడ్2ఎస్ పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. 2జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ను ఇందులో ఏర్పాటు చేశారు. మీడియాటెక్ హీలియో ఆక్టాకోర్ ప్రాసెసర్ను అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఫోన్లో అందిస్తున్నారు.
లావా జడ్2ఎస్ ఫీచర్లు
- 6.5 ఇంచుల హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 1600 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో ప్రాసెసర్
- 2జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్
- డ్యుయల్ సిమ్, 8, 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
- డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ
లావా జడ్2ఎస్ స్మార్ట్ ఫోన్ ధర రూ.7099గా ఉంది. దీన్ని అమెజాన్, ఫ్లిప్కార్ట్లతోపాటు లావా ఆన్లైన్ స్టోర్లోనూ విక్రయిస్తున్నారు.