చిరంజీవి కోసం ఆ ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నారా ? ఎవ‌రు ?

మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈయ‌న 40 ఏళ్లుగా టాలీవుడ్‌లో ఉన్నారు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. ఈయ‌న‌కు పోటీ ఎవ‌రూ లేర‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేక‌పోయినా క‌ష్ట‌ప‌డి స్వ‌యం కృషితో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నారు. పునాదిరాళ్లు అనే మూవీతో సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈయ‌న అంచ‌లంచెలుగా ఎదిగారు. ఈ వ‌య‌స్సులోనూ ఈయ‌నే నంబ‌ర్ వ‌న్ హీరోగా ఉన్నారు. అయితే 10 ఏళ్ల పాటు రాజ‌కీయాల వ‌ల్ల సినిమాల‌కు దూర‌మైనా మ‌ళ్లీ ఖైదీ నంబ‌ర్ 150 మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నారు. త‌న‌లో ఇంకా యాక్టింగ్ ప‌వ‌ర్ ఉంద‌ని నిరూపించారు.

ఈ వ‌య‌స్సులోనే చిరంజీవి చేసే డ్యాన్స్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. యంగ్ హీరోలకు దీటుగా ఆయ‌న డ్యాన్స్ స్టెప్స్ వేస్తుంటారు. ప్ర‌స్తుతం చిరు వ‌రుస సినిమాల‌తో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవి త‌న కెరీర్‌లో ఎంతో మంది హీరోయిన్ల‌తో న‌టించారు. అప్ప‌ట్లో ఆయ‌న మాధ‌వి, రాధిక‌, రాధ‌, విజ‌య‌శాంతి, ర‌మ్య‌కృష్ణ‌, రంభ‌, రోజా వంటి హీరోయిన్ల‌తో న‌టించారు. త‌రువాత సాక్షి శివానంద్‌, సిమ్రాన్‌, ఇప్పుడు కాజ‌ల్‌, న‌య‌న‌తార‌, త‌మ‌న్నా.. ఇలా మూడు త‌రాల హీరోయిన్ల‌ను క‌వ‌ర్ చేశారు. అయితే చిరంజీవి త‌న కెరీర్ లో ఎన్నడూ వివాదాల్లో చిక్కుకోలేదు. అలాగే ఏ హీరోయిన్‌తోనూ అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించ‌లేదు. చాలా హుందాగా ఉండేవారు. కానీ ఒక మూవీ షూటింగ్‌లో ఆయ‌న కోసం ఇద్ద‌రు హీరోయిన్లు కొట్టుకున్నార‌ట‌. అయితే నిజంగా కాదులెండి. అదంతా ఫ‌న్నీగానే సాగింది. ఇంత‌కీ అది ఏ సినిమా అంటే..

అప్ప‌ట్లో ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్‌తో చేసిన ఇంద్ర మూవీ ఎంత‌టి ఘ‌న విజ‌యాన్ని సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. బి.గోపాల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ మూవీ 2002 జూలై 24వ తేదీన రిలీజ్ అయి బాక్సాఫీస్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. ఇందులో చిరుకు జోడీగా ఆర్తి అగ‌ర్వాల్‌, సోనాలి బింద్రెలు హీరోయిన్లుగా న‌టించారు. అయితే చివ‌ర్లో ఒక సీన్ ఉంటుంది. క్లైమాక్స్‌లో ఆర్తి అగ‌ర్వాల్‌, సోనాలిలు చిరంజీవి కోసం పోట్లాడుకుంటారు. ఆయ‌న నాకే భ‌ర్త అవుతాడంటే.. కాదు నాకే భ‌ర్త అవుతాడు.. అంటూ ఇద్దరూ పోట్లాడుకుంటారు. అయితే వాస్త‌వానికి అక్క‌డ చిన్న ఫ‌న్నీ గొడ‌వ జ‌రిగింద‌ట‌.

ఆర్తి అగ‌ర్వాల్ త‌న‌నే ఇంద్ర పెళ్లి చేసుకున్న‌ట్లు చూపించాల‌ని ద‌ర్శ‌కున్ని కోర‌గా.. సోనాలి కూడా త‌న‌కే తాళి క‌ట్టిన‌ట్లు క్లైమాక్స్‌ను ముగించాల‌ని ద‌ర్శ‌కున్ని కోరింద‌ట‌. దీంతో ఇద్ద‌రూ ఈ విషయంలో ఫ‌న్నీగా గొడ‌వ‌ప‌డ్డార‌ట‌. అయితే ఇలా కాకుండా ఇంద్ర అనే వ్య‌క్తి ప్ర‌జ‌ల మ‌నిషి అని చెబుతూ ముగింపును ఇస్తారు. ఇలా క్లైమాక్స్‌ను తెర‌కెక్కించారు. దీంతో ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య గొడ‌వ ముగుస్తుంది. అయితే ఆ షూటింగ్‌లో జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌ను మెగాస్టార్ ఇప్ప‌టికీ చెబుతూ నవ్విస్తుంటారు.

Share
IDL Desk

Recent Posts

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM