దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ కరోనా రక్కసి ఏకంగా కుటుంబాలపై పంజా విసిరి కుటుంబం మొత్తాన్ని బలితీసుకుంటుంది. ఈ మహమ్మారి బారిన పడి ఓ వ్యక్తి ఏకంగా నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రాణాలు దక్కించుకో లేకపోయాడు.
గ్రేటర్ వరంగల్ పరిధిలోని 16వ డివిజన్ ధర్మారానికి చెందిన పోలెబోయిన రాజన్బాబు ఉపాధి నిమిత్తం హైదరాబాద్ చేరుకొని అక్కడ సిమెంట్, ఐరన్ వ్యాపారంతో పాటు జిమ్ సెంటర్ కూడా నిర్వహిస్తున్నారు. తాజాగా రాజన్ బాబు తన భార్య ,ఇద్దరు పిల్లలు కరోనా భారినపడగా అందరూ
క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలోనే రాజన్ బాబు ఆరోగ్యం క్షీణించడంతో అతనికి చికిత్స నిమిత్తం నగరంలోని మూడు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.అన్ని ఆస్పత్రులలో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేశారు. రాజన్ బాబు చికిత్స కోసం ఫ్లాట్ ను కూడా అమ్మేసి చికిత్స అందించారు. సుమారు నలభై ఆరు లక్షల రూపాయలను ఖర్చు చేసినప్పటికీ అతని ప్రాణాలు కోల్పోయాడు. రాజన్ బాబు మాత్రమే కాకుండా తన తల్లి, సోదరి సైతం ప్రాణాలు కోల్పోగా భార్య పిల్లలు చికిత్స తీసుకుంటున్నారు. ఈ విధంగా కరోనా మహమ్మారికి కుటుంబం మొత్తం బలి కావడంతో రాజన్ భార్యాబిడ్డలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Temples For Moksham : ప్రపంచవ్యాప్తంగా మనకు దర్శించేందుకు అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆలయాలు మాత్రం…
Chintha Chiguru Pulihora : పులిహోర.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. చింతపండు, మిరియాల పొడి,…
Black Marks On Tongue : మన శరీరంలోని అనేక అవయవాల్లో నాలుక కూడా ఒకటి. ఇది మనకు రుచిని…
Cabbage Onion Pakoda : పకోడీలు అంటే చాలా మందికి ఇష్టమే. చల్లని వాతావరణంలో వేడిగా పకోడీలను తింటే ఎంతో…
Pomegranate : మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి…
Mango Ice Cream : వేసవి కాలంలో సహజంగానే మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తుంటాయి. వీటిని చాలా మంది…
Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనాలు అందరూ చల్లని మార్గాలను ఆశ్రయిస్తున్నారు.…
Jonna Rotte : చపాతీ, రోటీ, నాన్.. తినడం మనకు తెలిసిందే. ఇప్పుడు వాటి స్థానంలో జొన్న రొట్టెని లొట్టలేసుకుంటూ…