కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు. దేశంలో అందరికీ కోవిడ్ టీకాలను ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ కేంద్రమే ఉచితంగా కోవిడ్ టీకాలను అందిస్తుందని, కోవిడ్ టీకాల కోసం రాష్ట్రాలు పైసా ఖర్చు చేయాల్సిన పనిలేదని మోదీ అన్నారు.
కరోనా నేపథ్యంలో సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని, టీకాల కోసం ఎవరూ ఖర్చు చేయాల్సిన పనిలేదన్నారు. దేశ ప్రజలందరికీ టీకాలు వేసే బాధ్యత కేంద్రానిదే అని అన్నారు.
నవంబర్ వరకు దేశంలోని 80 కోట్ల మందికి టీకాలు వేస్తామని మోదీ అన్నారు. కోవిడ్ టీకాల పట్ల ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయని, టీకాలు తీసుకునేందుకు ఎవరూ భయ పడాల్సిన పనిలేదని అన్నారు. ప్రతి ఒక్కరూ టీకాను తీసుకోవాలన్నారు. టీకాలపై ఇతరులకు ఉండే అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. కోవిడ్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. కరోనాపై చేస్తున్న పోరాటంలో అందరం విజయం సాధిస్తామని, భారత్ కోవిడ్ పై విజయం సాధిస్తుందని అన్నారు.
Work From Home Scam : సోషల్ మీడియా ప్రభావం ప్రస్తుత తరుణంలో ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే…
Temples For Moksham : ప్రపంచవ్యాప్తంగా మనకు దర్శించేందుకు అనేక ఆలయాలు ఉన్నాయి. అయితే వాటిల్లో కొన్ని ఆలయాలు మాత్రం…
Chintha Chiguru Pulihora : పులిహోర.. ఈ పేరు చెప్పగానే చాలా మందికి నోట్లో నీళ్లూరతాయి. చింతపండు, మిరియాల పొడి,…
Black Marks On Tongue : మన శరీరంలోని అనేక అవయవాల్లో నాలుక కూడా ఒకటి. ఇది మనకు రుచిని…
Cabbage Onion Pakoda : పకోడీలు అంటే చాలా మందికి ఇష్టమే. చల్లని వాతావరణంలో వేడిగా పకోడీలను తింటే ఎంతో…
Pomegranate : మనకు తినేందుకు అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో దానిమ్మ పండ్లు కూడా ఒకటి. ఇవి…
Mango Ice Cream : వేసవి కాలంలో సహజంగానే మనకు మామిడి పండ్లు విరివిగా లభిస్తుంటాయి. వీటిని చాలా మంది…
Mangoes : ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా ఎండలు మండిపోతున్నాయి. దీంతో జనాలు అందరూ చల్లని మార్గాలను ఆశ్రయిస్తున్నారు.…