Huzurabad : హుజురాబాద్‌లో భారీగా పెరిగిన పోలింగ్‌.. ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా ఎదురుచూపులు..

Huzurabad : హుజురాబాద్‌లో గ‌తంలో క‌న్నా ఈసారి భారీగా పోలింగ్ పెరిగింది. దీంతో అధికార టీఆర్ఎస్‌తోపాటు బీజేపీ నేత‌లు కూడా ఫ‌లితాల కోసం ఉత్కంఠ‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీకే ప‌ట్టం క‌ట్టిన నేప‌థ్యంలో ఆ పార్టీ నేత‌లు కొంత ఊర‌ట ఫీల‌వుతున్నా.. ఎగ్జిట్ పోల్స్ అనేవి నిజ‌మైన ఫ‌లితాలు కావు క‌నుక‌.. వారిలోనూ ఉత్కంఠ నెల‌కొంది. మ‌రోవైపు అధికార తెరాస పార్టీ నేతలు కూడా ఫ‌లితం ఎలా వ‌స్తుందా ? అని ఆందోళ‌న‌గా ఎదురు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో మొత్తం 86.33 శాతం పోలింగ్ న‌మోదు అయింది. 2.05 ల‌క్ష‌ల మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. 2018 తో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం 2.5 వ‌ర‌కు పెరిగింది. దీంతో త‌మ‌కే అనుకూల ఫలితం వ‌స్తుంద‌ని తెరాస‌, బీజేపీలు ఎవ‌రికే వారే ధీమాగా ఉన్నారు. కానీ లోప‌ల మాత్రం ఆందోళ‌న‌గానే క‌నిపిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

తెరాస‌, బీజేపీల మధ్యే ఈ ఉప ఎన్నిక‌లో ప్ర‌ధాన పోటీ నెల‌కొంద‌ని చెప్ప‌వ‌చ్చు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా దీన్ని పార్టీల మ‌ధ్య పోరుగా చూడ‌డం లేదు. సీఎం కేసీఆర్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న కోణంలో చూస్తున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. మొత్తం 2,36,837 ఓట్లు ఉండ‌గా 2,05,053 మంది ఓటు వేశారు. దీంతో రెండు పార్టీల మ‌ధ్య ట‌ఫ్ ఫైట్ న‌డుస్తుంద‌ని అంటున్నారు.

ఇక న‌వంబ‌ర్ 2న ఓట్ల కౌంటింగ్ ఉన్న నేప‌థ్యంలో ఆ రోజు విజేత ఎవ‌రు అనేది స్ప‌ష్టంగా తేల‌నుంది. ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన‌ప్ప‌టి నుంచి ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని ఇరు పార్టీల నేత‌లు మొద‌లుపెట్టేశారు. ఈ క్ర‌మంలోనే నువ్వా నేనా అన్న స్థాయిలో ప్ర‌చారం నిర్వ‌హించారు. తెరాస త‌మ విద్యార్థి విభాగ నాయ‌కుడు గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌ను బ‌రిలో నిల‌ప‌గా.. ఈట‌ల రాజేంద‌ర్ ఇప్ప‌టికే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఉన్నారు. దీంతో ఇరువురి మ‌ధ్య పోరు ఉధృతంగా సాగింది.

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావు తెరాస ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిరంత‌రాయం నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలోనే తాము ఈట‌ల‌పై భారీ మెజారిటీతో గెలుస్తామ‌ని ఆయ‌న ఇప్ప‌టికీ చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో హుజురాబాద్ ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో ఉప ఎన్నిక‌లో గెలుస్తామ‌ని ఆయ‌న ధీమాగా ఉన్నారు.

ఇక మ‌రోవైపు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కూడా ఉప ఎన్నిక‌లో గెలుపుపై ధీమా వ్య‌క్తం చేశారు. తెరాస అనేక విధాలుగా ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ పెట్టాల‌ని ప్ర‌య‌త్నించింద‌ని ఆరోపించారు. డ‌బ్బు, అధికారంతో ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపుకు తిప్పుకోవాల‌ని తెరాస చూసింద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు ఈట‌ల రాజేంద‌ర్‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌న్నారు.

అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్ర‌కారం.. బీజేపీకి 50 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని, తెరాస‌కు 43 శాతం, కాంగ్రెస్‌కు 5.7 శాతం ఓట్లు వ‌స్తాయ‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అనుకూలంగా రావ‌డం విశేషం. అయితే 2018లో కాంగ్రెస్ పార్టీకి 34 శాతం ఓట్లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో కాంగ్రెస్ త‌ర‌ఫున కౌశిక్ రెడ్డి పోటీ చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌పై ఈట‌ల 43వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈట‌ల‌కు 1,04,840 ఓట్లు వ‌చ్చాయి. కౌశిక్ రెడ్డికి 61,121 ఓట్లు వ‌చ్చాయి. బీజేపీ అభ్య‌ర్తి పి.ర‌ఘుకు 1683 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. నోటాకు 2,867 మంది ఓటు వేశారు.

త‌రువాత కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన కౌశిక్ రెడ్డి ఇటీవ‌ల టీఆర్ఎస్‌లో చేరారు. దీంతో ఆయ‌నకు తెరాస ఎమ్మెల్సీ ప‌ద‌వికి నామినేష‌న్ వేసే అవ‌కాశం క‌ల్పించింది. ఈట‌ల రాజేంద‌ర్ 2009 నుంచి హుజురాబాద్‌లో గెలుపొందుతూ వ‌స్తున్నారు. అప్ప‌టి నుంచి ఆయ‌న తెరాస త‌ర‌ఫునే పోటీ చేస్తూ వ‌చ్చారు. కానీ ఈసారి ఆయ‌న బీజేపీ త‌ర‌ఫున పోటీ చేశారు. ఈట‌ల తెరాస ప్ర‌భుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. త‌రువాత వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రిగా రెండో సారి తెరాస అధికారంలోకి వ‌చ్చాక ప‌నిచేశారు. అనంత‌రం ఆయ‌న‌పై భూ ఆక్ర‌మ‌ణల ఆరోప‌ణ‌లు రావ‌డంతో సీఎం కేసీఆర్ ఈట‌ల‌ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. ఈ క్ర‌మంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫ‌లితం కోసం స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM