Aishwarya Rajinikanth : తమిళ స్టార్ సెలబ్రిటీ కపుల్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత 18 సంవత్సరాల క్రితం ప్రేమించుకొని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట ఈ ఏడాది ఉన్నఫలంగా విడిపోతున్నామంటూ విడాకుల ప్రకటన చేసి అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఇలా భార్యాభర్తల బంధం నుంచి విడిపోయిన తర్వాత ఐశ్వర్య తిరిగి తన కెరీర్ పై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఐశ్వర్య మెగాఫోన్ చేత పట్టి ఓ మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేస్తూ బిజీ అయ్యింది. ఇలా ఎవరి కెరియర్ లో వారు బిజీగా ఉన్నప్పటికీ విడాకులు తీసుకుని విడిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయం మాత్రం వెల్లడించలేదు. అదేవిధంగా విడాకుల గురించి ఎక్కడా ప్రస్తావించకుండా భార్య భర్తల బంధం నుంచి విడిపోయి స్నేహితులుగా ఉంటామని తెలియజేశారు.
విడాకుల అనంతరం ఈ జంట స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకున్నారు. ఇలా వీరిద్దరి లేటేస్ట్ ట్వీట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐశ్వర్య రజినీకాంత్.. పయని అనే మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేయగా.. ఈ వీడియోని తమిళ వెర్షన్ లో రజనీకాంత్, తెలుగులో అల్లు అర్జున్, మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు. ఇక ఈ వీడియోపై ధనుష్ స్పందిస్తూ.. పయని మ్యూజిక్ వీడియోను డైరెక్ట్ చేసిన నా స్నేహితురాలు ఐశ్వర్యకు అభినందనలు. గాడ్ బ్లెస్ యు.. అంటూ ధనుష్ పోస్ట్ పెట్టారు.
ఐశ్వర్య ఆయన ట్వీట్ కి స్పందిస్తూ థాంక్యూ అంటూ రిప్లై ఇచ్చింది. ఈ విధంగా ఐశ్వర్య, ధనుష్ స్నేహితులుగా మారి ట్వీట్స్ చేసుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే వీరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. విడాకుల తరువాత మొదటి సారిగా ఇలా సోషల్ మీడియా వేదికగా వీరు మాట్లాడుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…