Jobs : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ (APPSC) నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆయుష్ విభాగంలో ఖాళీగా ఉన్న 151 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూనాని, హోమియో విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఉద్యోగాలకు ఈడబ్ల్యూఎస్ అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 సంవత్సరాలకు మించి ఉండకూడదు. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆయుర్వేదం, యునానీ, హోమియోలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంవత్సరం పాటు ఇంటర్న్షిప్ చేయడంతోపాటు దరఖాస్తు చేస్తున్న విభాగంలో మెడికల్ ప్రాక్టీస్నర్గా రిజిస్టర్ అయి ఉండాలి.
ఈ నోటిఫికేషన్ లో భాగంగా మెడికల్ ఆఫీసర్ ఆయుర్వేదం 72, మెడికల్ ఆఫీసర్ యునానీ 26, మెడికల్ ఆఫీసర్ హోమియో 53 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు https://psc.ap.gov.in/ అనే అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించి తెలుసుకోవచ్చు.