Tollywood : గత కొద్ది నెలలుగా అటు ఏపీ ప్రభుత్వానికి, ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు చెలరేగుతున్నాయి. గతంలో పవన్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదికగా చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యాయి. ఆయన ఏపీ ప్రభుత్వం, మంత్రులపై విమర్శలు చేశారు. దీంతో పవన్ను ఏపీ మంత్రులు విమర్శించారు.
పవన్ లాంటి అగ్ర హీరోలు అంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకునే బదులు దాన్ని తగ్గించుకుంటే.. తగ్గిన సినిమా టిక్కెట్ ధరలతో పెద్ద నష్టమేమీ ఉండదని మంత్రులు అన్నారు. దీంతో ఈ వివాదం అప్పట్లో చిలికి చిలికి గాలివాన అయింది. ఆ తరువాత అది పవన్ వర్సెస్ పోసానిగా మారింది. ఇక ఆ తరువాత మా అసోసియేషన్ ఎన్నికలు జరిగాయి. దీంతో ఈ వివాదాన్ని చాలా మంది మరిచిపోయారు.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం ఏ విషయాన్ని మరిచిపోలేదు. జీవోల మీద జీవోలు తెచ్చింది. సినిమా టిక్కెట్ల ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక దీని తరువాత కరోనా మూడో వేవ్ వచ్చింది. దీంతో పెద్ద సినిమాలు అన్నీ విడుదలను వాయిదా వేసుకున్నాయి. కాగా ఈ మధ్యే చిరంజీవి మరోమారు సీఎం జగన్ను కలిశారు. ఈ క్రమంలో సయోధ్య కుదిరిందని.. త్వరలోనే టాలీవుడ్కు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెబుతుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవే నిజం కానున్నాయా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
ఏపీ ప్రభుత్వం త్వరలోనే సినిమా టిక్కెట్ ధరలపై మళ్లీ కీలక నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. సినిమా టిక్కెట్ల ధరలను థియేటర్లు అవసరం అయినప్పుడు పెంచుకునేలా మళ్లీ ఇంకో జీవోను విడుదల చేస్తారని సమాచారం. అదే జరిగితే టాలీవుడ్కు పండుగ చేసుకునే వార్త అని చెప్పవచ్చు. దీంతో త్వరలో విడుదల కానున్న సినిమాల నిర్మాతలు ఊపిరి పీల్చుకుంటారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై పాజిటివ్గా ఉందని కూడా తెలిసింది. మరి ఆ జీవోను ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి.
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…
Venu Swamy : సెలెబ్రిటీల జ్యోతిష్యుడిగా ఫేమస్ అయిన వేణు స్వామి పలువురి జతకాలు చెప్తూ.. వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరు…
ప్రభుత్వాలు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా కూడా ప్రజలలో మార్పు రావడం లేదు. చిన్న చిన్న పిల్లలపై కూడా హత్యాచారాలు…
KTR : తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. సందర్భం వచ్చిన ప్రతిసారి…
Bandru Shobha Rani : ప్రస్తుతం తెలంగాణలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి…
Sai Dharam Tej : సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అన్న విషయం ప్రత్యేకంగా…