మనిషి పుట్టుక, చావు.. అనేవి మనిషి చేతిలో ఉండవు. మనిషి కడుపులో పిండంగా పడ్డ తరువాత అతని భవిష్యత్తు నిర్ణయమవుతుంది. అతను ఏమవ్వాలనుకునేది ముందుగానే నిర్ణయించబడుతుంది. అయితే ఇంత వరకు అందరికీ తెలిసిన విషయమే. కానీ మనిషి చనిపోయిన తరువాత అసలు ఏం జరుగుతుంది.. అతని ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్కడికి వెళ్తుంది.. అన్న సందేహాలు చాలా మందికి వస్తుంటాయి. దీనికి సంబంధించి అనేక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇందుకు గరుడ పురాణంలో చక్కగా వివరణ కూడా ఉంది. ఆ విషయాలనే ఇప్పుడు తెలుసుకుందాం.
మనిషి ఆయువు తీరిన వెంటనే యమపాశం వస్తుంది. ఆ పాశం మనిషి ఆత్మను బయటకు తీస్తుంది. మనిషి ఆత్మ ఒక పట్టాన బయటకు రాదు. వచ్చేందుకు మొండికేస్తుంది. అయినా సరే యమపాశానికి తిరుగు ఉండదు. కనుక పాశం ప్రయోగించబడిన వెంటనే ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేస్తుంది. అది బొటన వేలి సైజులో ఉంటుంది. ఇక ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చిన వెంటనే యమపురికి వెళ్తుంది. అక్కడ 2 ఘడియల పాటు ఉంటుంది. ఆ తరువాత మళ్లీ శరీరం దగ్గరకు వస్తుంది. అక్కడే తిరుగుతూ ఉంటుంది.
ఆత్మ శరీరం దగ్గరకు వచ్చి అంతా తిరుగుతూ చూస్తుంటుంది. తన మృతదేహాన్ని చూసేందుకు ఎవరు వచ్చారు.. తన గురించి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు.. అన్న విషయాలను ఆత్మ పరిశీలిస్తుంది. అయితే ఆ సమయంలో మనం చనిపోయిన వారి గురించి చెడుగా మాట్లాడరాదు. చనిపోయిన వ్యక్తి ఎంతటి పాపాలు చేసినా సరే అతని ఆత్మ అక్కడే ఉంటుంది కనుక ఆ సమయంలో మనం అతని గురించి చెడుగా మాట్లాడరాదు. ఇక మృతదేహాన్ని శాస్త్రోక్తంగా దహనం చేసిన తరువాత 11 రోజుల వరకు ఆత్మ ఆ ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్యే ఉంటుంది. తన గురించి తన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు.. తనకు చేయాల్సిన కర్మలు ఎవరు ఎలా చేస్తున్నారు.. పిండం ఎలా పెడుతున్నారు.. చనిపోయాక అసలు తనను పట్టించుకుంటున్నారా.. లేదా.. అన్న విషయాలను ఆత్మ పరిశీలిస్తుంది.
11 రోజుల తరువాత పెద్ద కర్మ అనంతరం ఆత్మ మళ్లీ యమపురికి వెళ్తుంది. అక్కడ ఆత్మకు శిక్షలు ఉంటాయి. ఆ తరువాత ఆత్మ మళ్లీ ఇంకో జీవిలోకి ప్రవేశపెట్టబడుతుంది. ఇలాంటి సందర్భంలో తిరిగి అదే ఇంట్లోనే చనిపోయిన ఆ వ్యక్తి మళ్లీ పుట్టేందుకు అవకాశాలు ఉంటాయి. కానీ ఇందుకు నియమాలు కూడా ఉంటాయి. ఇక ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మలు మాత్రం ప్రేతాత్మలుగా మారుతాయి. వారికి కర్మ చేసినా సరే వారు ప్రేతాత్మలుగానే చాలా కాలం పాటు ఉంటారు. వారు తమ తప్పు తెలుసుకున్నాక అప్పుడు వారి ఆత్మలను ఇంకో జీవిలోకి పంపిస్తారు. ఇలా గరుడ పురాణంలో ఆత్మల గురించి వివరించబడింది. చనిపోయాక ఆత్మ ఏం చేస్తుంది.. ఎక్కడకు వెళ్తుంది.. అన్న వివరాలు అందులో ఇంకా క్షుణ్ణంగా వివరించబడ్డాయి.
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…
Viral Video : ఇటీవలి కాలంలో యువత చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాస్త మనస్థాపం చెందడంతో ఆత్మహత్యే…