ఆధ్యాత్మికం

Pothuluri Veerabrahmendra Swamy : పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చెప్పిన కాల‌జ్ఞానంలో ఇంకా జ‌రిగేవి ఇవే..!

Pothuluri Veerabrahmendra Swamy : పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి గురించి అంద‌రికీ తెలిసిందే. ఈయ‌న మ‌హాజ్ఞాని. కాలజ్ఞానం ర‌చించారు. అందుక‌నే ఆయ‌న‌కు చాలా పేరు వ‌చ్చింది.ఈయ‌న చెప్పిన‌వ‌న్నీ ఇప్ప‌టికే పొల్లు పోకుండా అన్నీ జ‌రిగాయి. ఇక ఈశాన్య దేశంలో పుట్టే కోరంకి అనే జ‌బ్బు వల్ల కోట్ల మంది చ‌నిపోతార‌ని బ్ర‌హ్మం గారు ఎప్పుడో చెప్పారు. ఆయ‌న చెప్పిన‌ట్లే చైనాలో క‌రోనా పుట్టి దాని వ‌ల్ల ఎంతో మంది చ‌నిపోయారు. ఇక బ్ర‌హ్మం గారి కాల‌జ్ఞానం ప్ర‌కారం ఇంకా ఎలాంటి ఉత్పాతాలు సంభ‌విస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరుగుతుంది. పుణ్యం చేసిన వారు చ‌నిపోతారు. శ్రీశైల పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది భ్రమరాంబ ఆల‌యంలో 8 రోజులుండి మేకలా కూసి త‌ర్వాత మాయమ‌వుతుంది. శ్రీశైలంలో అగ్ని వర్షం ప‌డుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు) రంకెలు వేస్తాడు. ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.

కృష్ణా, గోదావరి మధ్య పశువులు మరణిస్తాయి. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు, నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తాము చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది. విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది. గ్రామాలు, పట్టణాలలో ర‌క్త వ‌ర్షం కురుస్తుంది. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది. అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది. ఆ త‌రువాత‌ దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి. ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి. తూర్పు దేశం ధూళి అయిపోతుంది. హరిద్వార్‌లోని మర్రి చెట్టుపై మహిమలు పుడతాయి. అక్కడి దేవాలయం తలుపులు మూసుకుంటాయి.

Pothuluri Veerabrahmendra Swamy

అహోబిలంలో ఉక్కు స్థంభానికి కొమ్మ‌లు పుట్టి జాజిపూలు పూస్తాయి. వావి వరసలు లేకుండా వివాహాలు జరుగుతాయి. అరణ్యంలో భూమిలో ధనం ఉంటుంది. పాతాళంలో నీరు ఇంకిపోతుంది. భూమిపై మంటలు పుడతాయి. నాలుగు సముద్రాల మధ్య ఉన్న ధనమంతా శ్రీశైలం చేరుతుంది. నూట ఇరవై తిరుపతులు నాశ‌న‌మ‌వుతాయి. నాలుగు దిక్కులలో దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి. అమావాస్య రోజున పున్నమి చంద్రుడు క‌నిపిస్తాడు. ఆ చంద్రున్ని చూసిన జనాలు నశిస్తారు. తూర్పున శిరస్సు, పడమర తోకగా 20 బార‌ల పొడ‌వుండే ధూమకేతువనే నక్షత్రం పుడుతుంది. అది పుట్టిన 30 రోజుల వరకు అందరికీ కనిపిస్తుంది. ఆ త‌రువాత‌ ఆకాశం ఎర్రగా మారుతుంది. ఆవులు పైకి చూసి అరుస్తాయి. ఆకాశంలో శబ్దాలు పుడతాయి. బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది. మాహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయకోతులను ఆడిస్తుంది. కృష్ణవేణి ఉప్పొంగి దుర్గమ్మ ముక్కుపుడక తాకుతుంది. కంచి కామాక్షమ్మ కంట కన్నీరు కారుతుంది. కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది.

పట్ట పగలు ఆకాశం నుంచి పిడుగుల వాన ప‌డుతుంది. అందులో కొందరు మరణిస్తారు. జ‌నాల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనాలు మరణిస్తారు. జంతువులూ అలాగే చనిపోతాయి. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దాంట్లో చిక్కుకుని మరణిస్తారు. ప్రధానమైన 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి. ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో 1 రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు. జనాలు అరచి అరచి చనిపోతారు. 5వేల ఏళ్ళ తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమ‌వుతుంది. గ్రామాల్లో దొంగ‌త‌నాలు పెరిగిపోతాయి.

Share
IDL Desk

Recent Posts

క‌లెక్ష‌న్ల‌లో దుమ్ము రేపుతున్న స్త్రీ 2 మూవీ.. బాలీవుడ్ లో ఆల్‌టైమ్ హై రికార్డు..!

సాహో చిత్రంలో ప్ర‌భాస్ స‌ర‌స‌న కథానాయిక‌గా న‌టించి అల‌రించిన శ్ర‌ద్ధా క‌పూర్ రీసెంట్‌గా స్త్రీ2 అనే మూవీతో ప‌ల‌క‌రించింది. 2018లో…

Saturday, 21 September 2024, 5:47 AM

జానీ మాస్ట‌ర్ కేసులో అస‌లు ఏం జ‌రుగుతోంది..?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో ప‌డ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మ‌హిళా…

Friday, 20 September 2024, 9:27 PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఇప్పుడు త‌న రిలేష‌న్ ఎలా ఉందో చెప్పిన ఆలీ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ఇటు రాజ‌కీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…

Friday, 20 September 2024, 9:42 AM

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM