సాధారణంగా వీధుల్లో తిరిగే కుక్కలను పట్టుకునే మున్సిపల్ సిబ్బంది సంరక్షణ కేంద్రాల్లో విడిచి పెడతారు. లేదా కెన్నల్స్లో పెట్టి దత్తత తీసుకునే వారికి అందజేస్తారు. అయితే ఆ అధికారులు మాత్రం దారుణ నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా 300 కుక్కలను చంపేశారు. వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని లింగపాలెం పంచాయతీకి చెందిన అధికారులు 300 కుక్కలకు విషం పెట్టి చంపారు. విషపు ఇంజెక్షన్లను ఇచ్చి వాటిని బలి తీసుకున్నారు. ఈ క్రమంలో వాటిని కనీసం పూడ్చకుండా గొయ్యిలో పడేశారు. అయితే వాటిని అలా చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు అధికారులపై ఆగ్రహిస్తున్నారు.
మూగజీవాల పట్ల అంతలా పాశవికతను ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. ఈ క్రమంలోనే ఫైట్ ఫర్ యానిమల్ ఆర్గనైజేషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. కుక్కలను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ పంచాయతీ అధికారులపై ధర్మాజీగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అయితే ఈ విషయంపై స్పందించిన అధికారులు మాత్రం.. కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయని, అందుకనే చంపేశామని చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…