Samantha : సమంత, నాగచైతన్యల విడాకుల విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై పెద్ద ఎత్తున వార్తలను ప్రచురిస్తున్నాయి. అయితే సమంత, నాగచైతన్య విడాకులకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..
సమంత నుంచి విడాకులు తీసుకున్న తరువాత ఆమెకు రూ.200 కోట్లను భరణం కింద ఇచ్చేందుకు నాగచైతన్య ఒప్పుకున్నాడట. కానీ ఆ మొత్తాన్ని ఆమె తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయితే రూ.50 కోట్లను అయినా ఇవ్వాలని నాగచైతన్య అనుకుంటున్నారట. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.
కాగా గత కొద్ది రోజుల నుంచి వీరు విడాకులపై మౌనంగానే ఉన్నారు. మీడియాలో వస్తున్న వార్తలను ఖండించలేదు. కానీ సడెన్ గా వీరు విడాకులను తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ షాక్కు గురయ్యారు.