Evaru Meelo Koteeshwarulu : బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు మీలో కోటీశ్వరులు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున, చిరంజీవి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ కార్యక్రమానికి తాజాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండగా.. ఈ కార్యక్రమం గత కొన్ని వారాల నుంచి ప్రసారం అవుతున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మొదటివారం రేటింగ్స్ ఫరవాలేదనిపించుకున్నప్పటికీ, ఆ తర్వాతి వారాలు క్రమక్రమంగా రేటింగ్స్ పెరుగుతూ వచ్చాయి. తాజాగా బుధవారం రేటింగ్స్ కూడా పెరుగుతాయని నిర్వాహకులు భావించారు. అయితే నిర్వాహకులు ఊహించని విధంగా ఈ షో రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. ఎంతో మంచి రేటింగ్స్ దక్కించుకొని దూసుకుపోతున్న ఈ కార్యక్రమానికి బ్రేకులు పడ్డాయని చెప్పవచ్చు.
తాజాగా 5వ వారం ఈ కార్యక్రమానికి రేటింగ్స్ అధికంగా వస్తాయని భావించిన నిర్వాహకులకు 4.70 రేటింగ్స్ రావడంతో ఒక్కసారిగా నిర్వాహకులు షాకయ్యారు. అసలు ఇలా ఉన్నఫలంగా రేటింగ్స్ పడిపోవడానికి కారణం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అని తెలుస్తోంది. ఐపీఎల్ సరిగ్గా ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే సమయంలో రావడం చేత ఎంతో మంది ప్రేక్షకులు ఐపీఎల్ పై ఆసక్తి కనబరచడంతో అయిదవ వారం ఈ కార్యక్రమం రేటింగ్స్ అమాంతం పడిపోయాయి. మరి ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.