ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాల్లో యాంత్రీకరణ జరుగుతోంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతోంది. అన్ని పనులనూ యంత్రాలే చేస్తున్నాయి. దీని వల్ల చాలా మంది ఉపాధి కోల్పోతున్నారు. అలాంటి వారిలో టెర్రాకోట ఉత్పత్తులను తయారు చేసే కార్మికులు కూడా ఒకరు. అయితే అలాంటి కార్మికులు ఇప్పుడు నెల నెలా చక్కని ఆదాయం పొందుతున్నారు. అదంతా ఆ ఇద్దరి చలవే అని చెప్పవచ్చు.
అభినవ్ అగర్వాల్, మేఘా జోషి అనే ఇద్దరు యువత మిట్టిహబ్ (Mittihub) అనే ఆన్లైన్ స్టోర్ను 2020లో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వారు మొత్తం 25 మంది కార్మికులతో ఆ కంపెనీని చిన్నగా నెలకొల్పారు. అందుకు రూ.50వేల పెట్టుబడి పెట్టారు. అంతే.. కార్మికులు రూపొందించిన ఉత్పత్తులకు చక్కని ఆదరణ లభించింది. దీంతో వారు వెను దిరిగి చూడలేదు.
అలా ఆ ఇద్దరు యువత చేసిన పని వల్ల 25 మంది కార్మికులకు ఉపాధి లభ్యమైంది. దీంతో గతంలో వారు నెలకు రూ.15వేలు కూడా సంపాదించేవారు కాదు. కానీ ఇప్పుడు నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నారు. వారు రూపొందించిన టెర్రాకోట ఉత్పత్తులను ఆ ఇద్దరు ఆన్ లైన్లో విక్రయిస్తున్నారు. దీంతో ఆ కార్మికులకు ఉపాధి లభిస్తోంది.
రాజస్తాన్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఈ విధంగా టెర్రాకోట వస్తువులను తయారు చేసి విక్రయిస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. మనస్సుంటే మార్గముంటుందని, ఎవరైనా ఎవరికైనా సహాయం చేయవచ్చని ఆ ఇద్దరు యువత నిరూపించారు.