శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు మహిళలు పెద్ద ఎత్తున వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు. ఈ విధంగా వరలక్ష్మీ వ్రతం నిర్వహించడం వల్ల అమ్మవారి కృప ఎల్లవేళలా మనపై ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ క్రమంలోనే వరలక్ష్మీ వ్రతం రోజు పెద్ద ఎత్తున మహిళలు ఉపవాసాలు ఉండి అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ చేసి వివిధ రకాల పిండివంటలను నైవేద్యంగా సమర్పించి ఈ వ్రతం ఆచరిస్తారు. మరి ఎంతో పవిత్రమైన ఈ వ్రతం చేసేటప్పుడు ఏ విధమైనటువంటి పనులు చేయాలి ? ఏ పనులు చేయకూడదు ? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందామా..!
చేయాల్సిన పనులు
* వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళలు తప్పనిసరిగా ఉపవాసంతో ఈ వ్రతాన్ని ఆచరించాలి.
* అమ్మవారి పూజ చేస్తున్నంత సేపు మనసు మొత్తం అమ్మవారిపై ఉంచి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది.
* వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత వరలక్ష్మీ వ్రత కథ వినడం, చదవడం చేయాలి.
* అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి.
* పూజ అనంతరం ఐదుగురు ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి వాయనం ఇవ్వడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి.
చేయకూడని పనులు
* అమ్మవారికి వ్రతం చేయాలనుకునే వారు 2 రోజులపాటు శారీరక కలయికకు దూరంగా ఉండాలి.
* పూజ చేస్తున్నంత సేపు మన మనసును ఇతర అంశాలపై మళ్లించరాదు. మనసును అమ్మవారిపై ఉంచి భక్తితో పూజ చేసినప్పుడే ఫలితం ఉంటుంది.
* ఒకవేళ అమ్మవారి వ్రతం మనం ఆచరించక పోయినా ఇతరుల ఇంటికి వెళ్లేవారు మాంసాహారాన్ని ముట్టుకుని, తిని వెళ్ళకూడదు.
* బిడ్డకు జన్మనిచ్చి 22 రోజులు పూర్తి కాని వారు ఈ వ్రతంలో పాల్గొనకూడదు, ఈ వ్రతం చేయకూడదు.