సాధారణంగా శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే ఎవరికైనా సరే అతి దాహం, ఆకలి కలుగుతాయి. దీంతో షుగర్ను నియంత్రించుకునేందుకు మందులను వాడుతారు. అయితే ఆ బాలుడికి ఈ విషయం తెలియదు. దీంతో అతను తనకు షుగర్ ఉందని తెలియకపోవడంతో రోజుకు ఏకంగా 40 చపాతీలు తిన్నాడు. చివరకు హాస్పిటల్ పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన 12 ఏళ్ల సందీప్ అనే బాలుడు ఉన్నట్లుండి రోజుకు 40 చపాతీలు తినడం మొదలు పెట్టాడు. సడెన్ గా కంటి చూపు పోయింది. ఒక రోజు అతను స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో తండ్రి బన్వరి అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. వైద్యులు పరీక్షలు చేయగా ఆ బాలుడికి షుగర్ 1206 ఉన్నట్లు వచ్చింది. దీంతో వైద్యులే షాకయ్యారు.
అయితే ఆ బాలుడికి రోజుకు 6 యూనిట్ల ఇన్సులిన్ ను ఇచ్చారు. దీంతో షుగర్ లెవల్స్ కంట్రోల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో అతను స్పృహలోకి వచ్చాడు. అయితే షుగర్ ఎక్కువ కావడం వల్ల కంటి చూపు పోయింది. దీంతో వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉందని చెప్పారు.