డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఆర్మీలో పనిచేయాలనుకునే యువతకు శుభవార్త. నాన్ డిపార్ట్ మెంట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం భారత టెరిటోరియల్ ఆర్మీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది.
ఈ ఉద్యోగానికి అర్హత సాధించిన అభ్యర్థులు లెఫ్టినెంట్ హోదా కల్పిస్తారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు సాధారణం ఆర్మీ ఆఫీసర్లకు ఉన్నటువంటి అలవెన్సులు, జీతాలు అందుతాయి. ఈ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిలో రెండు నెలలు శిక్షణ ఉంటుంది. అదేవిధంగా అభ్యర్థులు రూ.56,100 నుంచి 1,77,500 వరకు జీతం పొందుతారు.మరి ఈ ఉద్యోగానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ..విద్యార్హతలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, మెడికల్ టెస్ట్, సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. పరీక్ష ఆఫ్లైన్ విధానం ద్వారా జరుగుతుంది.దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా 200 రూపాయల పరీక్ష రుసుము చెల్లించి ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. ఆగస్టు 19 2021 నాటికి వయసు 18 నుంచి 42 ఏళ్లు మించకూడదు. 19 ఆగస్టు దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను అభ్యర్థులు ఈ క్రింది వెబ్ సైట్ సంప్రదించవలెను.
https:www.jointerritorialarmy.gov.in/