Keerthy Suresh : తెలుగులో మహానటి చిత్రం ద్వారా కీర్తి సురేష్ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో ఆమె దశ ఒక్కసారిగా తిరిగిపోయింది. దీంతో ఆమెకు పలు వరుస సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. అయితే మహానటి తరువాత అంతగా చెప్పుకునే హిట్లేవీ ఈమెకు రాలేదు. అయినప్పటికీ అవకాశాలు మాత్రం పుష్కలంగానే వస్తున్నాయి.
ఇక కీర్తి సురేష్ తాజాగా యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తన చానల్ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, తన చానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని, అందులో వచ్చే వీడియోలను వీక్షించాలని.. కీర్తి సురేష్ కోరింది.
https://twitter.com/KeerthyOfficial/status/1486315834981351427
కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం గుడ్ లక్ సఖి. ఈ మూవీ ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి షూటింగ్ చాంపియన్గా ఎలా మారింది ? అన్న కథను చూపించనున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ముఖ్య అతిథిగా హాజరై ఆకట్టుకున్నారు.