Pooja Hegde : సౌత్ సినీ ఇండస్ట్రీలో అత్యంత బిజీగా ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డె ఒకరు. ఈమె వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ ఎంతో బిజీగా మారింది. అయితే ప్రస్తుత ఈమె చేస్తున్న సినిమాల షూటింగ్లు అన్నీ ముగిశాయి. దీంతో చాలా రోజుల తరువాత పూజా హెగ్డె ఎలాంటి షూటింగ్ లేకుండా ఖాళీగానే ఉంటోంది.
పూజా హెగ్డె నటించిన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా కారణంగా ఈ చిత్రాల విడుదల ఆలస్యం అవుతోంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె కొత్త మూవీ దేనికి కూడా సంతకం చేయలేదు. దీంతో చాలా రోజుల తరువాత పూజాకు ఖాళీ సమయం లభించింది.
ఈ క్రమంలోనే పూజా ఇటీవలే మాల్దీవ్స్కు వరుస టూర్స్ వేసింది. ఇక వెకేషన్ నుంచి వచ్చిన ఈ భామ ముంబైకి వెళ్లిపోయింది. అక్కడ ఈమె రీసెంట్గా కొత్త ఇంటిని కట్టుకుంది. ప్రస్తుతం అందులోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం చాలా ఖాళీ సమయం లభించినందున ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. వీలైనన్ని కొత్త సినిమాలకు సంతకాలు చేయాలని పూజా హెగ్డె భావిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో ఈమె కొత్త మూవీల గురించిన వివరాలు తెలియనున్నాయి.