Priyanka Chopra : ప్రస్తుత తరుణంలో చాలా మంది సెలబ్రిటీలు పిల్లల్ని కనేందుకు అంతగా ఆసక్తిని చూపించడం లేదు. కానీ సరోగసీ మార్గాన్ని వారు ఎంచుకుంటున్నారు. కొందరు సెలబ్రిటీలు వయస్సు అయిపోయాక సరోగసి ద్వారా పిల్లల్ని కని వాళ్లకు తోడుగా ఉంటారని పెంచుకుంటుంటే.. కొందరు మాత్రం వయసులో ఉన్నా కూడా సరోగసి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇక హాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ దంపతులు కూడా సరోగసి ద్వారానే బిడ్డను కన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వయంగా వెల్లడించింది.
మాకు సరోగసి పద్ధతిలో బిడ్డ జన్మించింది. ఈ ప్రత్యేకమైన సమయంలో మా కుటుంబానికి కాస్తంత ప్రైవసీ కల్పించండి.. అందరికీ థాంక్ యూ.. అని ప్రియాంక పోస్ట్ పెట్టింది.
కాగా అమెరికన్ సింగర్ అయిన నిక్ జోనస్ను ప్రియాంక చోప్రా 2018లో ఇండియాలోనే పెళ్లి చేసుకుంది. ఆమె అతని కన్నా ఏకంగా 10 ఏళ్ల వయస్సు పెద్దది కావడం విశేషం. ఇటీవల వీరిద్దరూ ఓ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ సరోగసి విషయాన్ని నిర్దారించారు. తాజాగా వీరికి బిడ్డ జన్మించడం విశేషం.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మారింది. పలు హాలీవుడ్ సినిమాల్లో ఈమె నటిస్తోంది.