T20 World Cup 2021 : భారత్, పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే చాలు.. క్రికెట్ చూడని వారు.. ఆ ఆట గురించి తెలియని వారు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. దాయాది దేశాలు.. చిరకాల ప్రత్యర్థులు.. కనుకనే భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ అంటే.. పనులు మానుకుని, ఆఫీసులకు సెలవు పెట్టి, కాలేజీలకు బంక్ కొట్టి మరీ మ్యాచ్లను చూస్తుంటారు. ఇక ఈ రోజు ఆదివారం కనుక సెలవు పెట్టాల్సిన పనిలేదు. ఎంచక్కా మ్యాచ్ను ఎంజాయ్ చేయవచ్చు.
అయితే భారత్, పాకిస్థాన్ల మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ కనుక సహజంగానే భారత క్రికెట్ అభిమానులకు, ఇతర వీక్షకులకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది. ఈ క్రమంలోనే ఒక సంస్థ అంచనా వేసిన ప్రకారం.. ఈ రోజు రాత్రి మ్యాచ్ను ఏకంగా 100 కోట్ల మంది చూస్తారని చెబుతున్నారు.
మన దేశంలో అనేక నగరాలు, ప్రధాన పట్టణాల్లో ఇప్పటికే పలు థియేటర్లు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ను తెరలపై ప్రసారం చేయనున్నాయి. అనేక కాలనీల్లో, అసోసియేషన్ కార్యాలయాల్లో కూడా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో ఈ మ్యాచ్ తెగ హై ఓల్టేజ్గా సాగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పటి వరకు ఐసీసీ టోర్నీల్లో భారత్దే పైచేయి కనుక.. ఈ మ్యాచ్లో కూడా అభిమానులు భారత్ గెలవాలని బలంగా కోరుకుంటున్నారు. మరి టీమిండియా తన మొదటి మ్యాచ్లోనే పాకిస్థాన్ను ఢీకొంటుంది కనుక ఎలా ఆడుతారో చూడాలి.