Samantha : విడాకుల తర్వాత సమంత పేరు సోషల్ మీడియాలో ప్రతి రోజూ హాట్ టాపిక్గానే మారుతోంది. ఈ అమ్మడికి సంబంధించి పలు వార్తలు చక్కర్లు కొడుతుండగా, వీటిపై సమంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. విడాకుల కోసం రూ.300 కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేయగా, తన డ్రెస్సింగ్పై వీడియోలు పెట్టి కించపరిచారు. అబార్షన్, అఫైర్స్.. అంటూ తప్పుడు కథనాలు అల్లారు. ఈ నేపథ్యంలో సమంత కోర్ట్ మెట్లెక్కింది.
సమంత తన డిజైనర్ తో అక్రమ సంబంధం పెట్టుకుందని , ఆయనతోనే రెండో పెళ్లి చేసుకోనుందని కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి. వాటికి ప్రీతమ్ చెక్ పెట్టాడు. తనని నేను అక్కా.. అని పిలుస్తా అని చెప్పాడు. అయితే ఎవరు ఎన్ని వివరణలు ఇచ్చినా , చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నా కూడా రూమర్స్ స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి.
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని.. అంటూ మరోసారి నెటిజన్లు ఆమె గురించి పెద్దఎత్తున దుష్ప్రచారం చేస్తున్నారు. దీనిపై సమంత ఏమైనా స్పందిస్తుందా.. అనేది చూడాలి. కాగా.. సమంత తన స్నేహితురాలితో కలిసి చార్ధామ్ యాత్రకు వెళ్లగా.. ఆ ట్రిప్ ముగిసింది. యమునోత్రి నుంచి మొదలైన యాత్ర గంగోత్రి మీదుగా కేదార్నాథ్, బద్రీనాథ్ వరకు కొనసాగింది.