JioPhone Next : టెలికాం కంపెనీ రిలయన్స్, సాఫ్ట్వేర్ సంస్థ గూగుల్ కలిసి సంయుక్తంగా రూపొందిస్తున్న జియో ఫోన్ నెక్ట్స్కు చెందిన స్పెసిఫికేషన్స్ నెట్లో లీక్ అయ్యాయి. అభిషేక్ యాదవ్ అనే యూజర్ ఈ ఫోన్కు చెందిన స్పెసిఫికేషన్స్ వివరాలను ట్వీట్ చేశారు. ఈ వివరాలు గూగుల్ ప్లే కన్సోల్లో నమోదు కాబడ్డాయి.
జియో ఫోన్ నెక్ట్స్లో హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఫోన్ డిస్ప్లే సైజ్ గురించి చెప్పలేదు. కానీ 4.7 ఇంచులుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1440 పిక్సల్స్ గా ఉంది. అలాగే ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్ను అందించనున్నట్లు తెలుస్తోంది. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 215 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్ వంటి ఇతర ఫీచర్లు దీంట్లో ఉన్నట్లు లీకైన స్పెసిఫికేషన్స్ ను చూస్తే అర్థమవుతోంది.
కాగా ఈ ఫోన్ ను రిలయన్స్ ఏజీఎంలో ముకేష్ అంబానీ ప్రకటించారు. వినాయక చవితికే ఈ ఫోన్ను లాంచ్ చేయాల్సి ఉంది. కానీ చిప్ల కొరత కారణంగా ఈ ఫోన్ విడుదలను దీపావళికి వాయిదా వేశారు. అయితే దీపావళి రోజు ఈ ఫోన్ను లాంచ్ చేస్తారేమోనని వినియోగదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఫోన్ ధరను రూ.3,499 గా నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది.