Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టి కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. పరుశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. నెక్ట్స్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. ఇదే ఫ్లో లో టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లేటెస్ట్ గా ఈ సినిమాని వచ్చే ఏడాది నుండి స్టార్ట్ చేస్తున్నారట.
ఈ విషయాన్ని మహేష్ బాబు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే ఈ సినిమాతో బాలీవుడ్ లోకి కూడా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సినిమా మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతుందని అన్నారు. ఈ రకంగా మహేష్ బాబు బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పట్నుండో చూస్తున్నారు. ఆ కల ఇప్పుడు నిజమవుతుంది అన్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్స్ గా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమా తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక మహేష్ బాబు గానీ, రాజమౌళి గానీ అధికారికంగా ప్రకటిస్తారని అన్నారు. ఇప్పటివరకు మహేష్ సినీ కెరీర్ లో ఎన్నడూ చూడని విధంగా ఆయన స్టైల్, స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అడవి నేపథ్యంలో అడ్వంచరస్ థ్రిల్లర్ కథతో స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారట. ఆ తర్వాత మరో లేటెస్ట్ జానర్ లో కూడా మహేష్ యాక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మహేష్ తో రాజమౌళి పురాణేతిహాసాల నేపథ్యాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు గరుత్మంతుడి పాత్రలో కనిపించనున్నట్లు టాక్. ఇందుకోసం మహేష్ తన లుక్ ని మార్చేయబోతున్నారట. ఇంకో వైపు అల్లు రామాయణంలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తారని అనుకున్నారు. ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా బాలీవుడ్ లోకి మహేష్ ఎంట్రీ ఇవ్వనున్నారనేది లేటెస్ట్ హాట్ న్యూస్.