Laptop : దసరా పండుగ సందర్బంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు ప్రత్యేక సేల్ లను నిర్వహిస్తున్న విషయం విదితమే. అయితే అమెజాన్ నిర్వహిస్తున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నారు. ముఖ్యంగా అసుస్ కంపెనీకి చెందిన గేమింగ్ ల్యాప్టాప్ను ఏకంగా రూ.60వేల డిస్కౌంట్తో కొనుగోలు చేసే ఆఫర్ను అందిస్తున్నారు.
అసుస్కు చెందిన టీయూఎఫ్ డాష్ ఎఫ్15 అనే ల్యాప్ టాప్ ధర రూ.1,39,900గా ఉంది. అయితే దీన్ని అమెజాన్లో రూ.60వేల డిస్కౌంట్తో రూ.79,990 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే ల్యాప్టాప్కు చెందిన ఐ5 వేరియెంట్ను రూ.69,990 కే కొనుగోలు చేయవచ్చని తెలిపారు.
సదరు ల్యాప్టాప్లో 15.6 ఇంచుల డిస్ప్లే, 11వ జనరేషన్ కోర్ ఐ7 ప్రాసెసర్, 16జీబీ వరకు ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. మరింకెందుకాలస్యం.. మీకు కావాలనుకుంటే వెంటనే ఆ ల్యాప్టాప్ను కొనుగోలు చేయండి మరి. ఇంతకన్నా మంచి ఆఫర్ మీకు లభించకపోవచ్చు.