కస్టమర్లకు శుభవార్త.. ఏటీఎం కార్డు లేకుండా డబ్బులు డ్రా చేసుకోవచ్చు..

April 2, 2021 5:24 PM

ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే కచ్చితంగా డెబిట్ కార్డ్ ఉండాలి. ఒకవేళ కార్డు అందుబాటులో లేకపోయినా యాప్ ద్వారా కోడ్ జనరేట్ చేసుకొని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. అయితే రానున్న రోజుల్లో డెబిట్ కార్డు అవసరం లేకుండా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసుకొనే సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది.ఎన్‌సీఆర్ కార్పొరేషన్ సంస్థ తొలి ఇంటర్ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్ సర్వీసులను ఆవిష్కరించింది. ఈ సేవల ద్వారా యూపీఐ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు ఎటిఎం నుంచి డబ్బులు పొందవచ్చు.

ఇప్పటికే సిటీ యూనియన్ బ్యాంక్ ఎన్‌సీఆర్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ బ్యాంకు కస్టమర్ అలాగే తొలిసారిగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఈ బ్యాంకు 1500 ఏటీఎంలను కొత్త ఫీచర్ తో అప్‌గ్రేడ్ చేయనుంది. ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలని భావిస్తే మన మొబైల్లో యూపీఐ యాప్ ద్వారా డబ్బులు పొందవచ్చు.

ఈ అప్ ద్వారా మన మొబైల్ లో ఉన్నటువంటి భీమ్, గూగుల్ పే, పేటీఎం, ఫోన్ పే వంటి యాప్స్ తెరిచి ఏటీఎం పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేయాలి. అయితే ఐదు వేల రూపాయల వరకు మాత్రమే తీసుకోవచ్చు.తర్వాత ప్రొసీడ్‌పై క్లిక్ చేసి యూపీఐ పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే చాలు ఏటీఎం నుంచి డబ్బులు వస్తాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment