ఫిక్స్‌డ్ డిపాజిట్ మెచ్యూర్ అయినా.. వడ్డీ వస్తుంది ఎలాగంటే?

July 4, 2021 11:14 AM

సాధారణంగా మనం సంపాదించుకున్న డబ్బులను బ్యాంకులో పొదుపు చేసుకోవడం చేస్తుంటాము. ఈ క్రమంలోనే కొందరు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తుంటారు. ఈ విధంగా డిపాజిట్ చేసిన డబ్బుకు నెల నెల బ్యాంకు వడ్డీ చెల్లిస్తుంది. అయితే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మెచ్యూర్ అయిన తర్వాత మనం ఆ డబ్బులను క్లెయిమ్ చేసుకోవాలి. లేకపోతే ఆ డబ్బులకు వడ్డీ వర్తించదని ఇదివరకు మనకు తెలిసిందే. అయితే ఇకపై మెచ్యూర్ అయినా కూడా క్లెయిమ్ చేసుకోకపోతే ఆ డబ్బులు క్లెయిం చేసుకునే వరకు వడ్డీ వస్తూనే ఉంటుంది.

ఈ విధంగా మనం డిపాజిట్ చేసిన డబ్బులకు వడ్డీ వస్తుందనే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా తన సర్కులర్ ద్వారా తెలియజేసింది. ఈ విధంగా డిపాజిట్ చేసిన డబ్బులు మెచ్యూర్ అయ్యాక ఒకవేళ ఎలాంటి ప్రొసీజర్ లేకుండా ఆగిపోతే ఆ మొత్తానికి సంబంధిత బ్యాంకులు వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

ప్రతి సంవత్సరం ఈ విధంగా బ్యాంకులలో క్లెయిమ్ చేసిన డిపాజిట్లు పెరిగిపోతుండటం వల్లనే రిజర్వ్ బ్యాంక్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని తన ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలోనే 2019 ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి బ్యాంకులో క్లెయిమ్ చేసుకొని డబ్బులు రూ.18,380 కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలిపింది. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం డబ్బులు డిపాజిట్ అకౌంట్‌లో ఎలాంటి ట్రాన్సాక్షన్లూ లేకపోతే RBI దాన్ని అన్‌క్లెయిమ్డ్ ఖాతాగా పరిగణిస్తుందని తెలిపారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment