శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎం32 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్ను భారత్లో విడుదల చేసింది. ఇందులో అదిరిపోయే ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్లో డిస్ప్లేకు 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ ఉంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీగా ఉంటుంది. అలాగే 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఇందులో ఏర్పాటు చేశారు.
శాంసంగ్ గెలాక్సీ ఎం32 ఫీచర్లు
ఈ ఫోన్లో 6.4 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన సూపర్ అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ లభిస్తుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి80 ప్రాసెసర్ను అమర్చారు. 6జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంది. దీనికి తోడు మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్, 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్లను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్లో ముందు వైపు 20 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మెమొరీని కార్డు వేసి పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్బీ టైప్ సి తదితర ఇతర ఫీచర్లు ఇందులో లభిస్తుంది.
ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేసినందున బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ వస్తుంది. అలాగే వేగంగా చార్జింగ్ కూడా అవుతుంది. ఈ ఫోన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.16,999గా ఉంది. జూన్ 28వ తేదీ నుంచి ఈ ఫోన్ అమెజాన్, శాంసంగ్ ఆన్లైన్ స్టోర్లలో లభిస్తుంది. దీనిపై ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా రూ.1250 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు.