నిండు గర్భంతో, మండుటెండలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ!

April 22, 2021 4:08 PM

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎంతో క్లిష్టమైన పరిస్థితులలో ప్రజలెవరూ బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఇలాంటి పరిస్థితులలో బయటకు రాకూడదని వీరు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ నిండు గర్భంతో, మండుటెండలో, లాఠీ పట్టుకొని నిలబడి తన విధులను నిర్వహిస్తున్న ఈ మహిళా అధికారికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.

కరోనా మహమ్మారి గర్భిణీ స్త్రీలకు తొందరగా వ్యాపిస్తుందని విషయం అందరికీ తెలిసినదే.అయితే ఆ విషయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, ప్రజల సంక్షేమం కోసం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు డీఎస్పీ శిల్పా సాహూ. ఈమె ప్రస్తుతం ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రాంతమైన దంతేవాడ డివిజన్ లో ఈ విధంగా విధులు నిర్వహిస్తూ కనిపించారు.

మండుటెండను సైతం లెక్క చేయకుండా రోడ్డులో నిలబడి ప్రజలకు కరోనా జాగ్రత్తలను సూచిస్తున్న వీడియోను పలువురు సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని ఆకట్టుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విధుల పట్ల ఈమెకు ఉన్న బాధ్యతకు సెల్యూట్ చేస్తున్నారు. మరికొందరు గర్భంతో ఉన్న ఈమెకు ఇలాంటి పరిస్థితులలో సెలవు ఇవ్వకుండా పనులు చేయించుకోవడం తగదని పలువురు విమర్శిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment