రోజురోజుకు వాతావరణంలో వివిధ మార్పుల వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు రోజు రోజుకి నీటి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న పెద్దపెద్ద పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాల వల్ల అధికంగా నీటి కాలుష్యం జరుగుతోంది.
నగరంలోని వివిధ పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు నీటి ఉపరితలంపై తెల్లని విషపు నురుగుగా పేరుకుపోతుంది. ప్రస్తుతం యమునా నది నీటిపై కూడా ఈ విధమైన తెల్లటి విషపు నురుగులు ఏర్పడ్డాయి. ఈ విధంగా నదీజలాలలో అధిక మొత్తంలో కాలుష్యం ఏర్పడటం వల్ల ఎన్నో జీవరాశులకు తీవ్ర ప్రమాదం వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం కలింది కుంజ్ ఏరియాలో యమునా నది పై ఏర్పడిన విషపు నురుగు మేటలకు సంబంధించిన ఫోటోలలో ఏ విధంగా యమునా నదిలో కాలుష్యం ఏర్పడిందో చూడవచ్చు. ఈ విషయంపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు