గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచే ఈ ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

June 10, 2021 1:02 PM

సాధారణంగా మనదేశంలో గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ సమయంలో ఎటువంటి ఆలయాలు తెరచుకోవు. గ్రహణ సమయం పట్టడానికి కొన్ని గంటల ముందే ఆలయాలను మూసివేస్తారు.తరువాత గ్రహణం విడిచిన కొన్ని నిమిషాల తర్వాత ఆలయాలు తెరిచి ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరిచి తిరిగి పూజలు చేయడం ప్రారంభిస్తారు.కానీ మన దేశంలో ఏ ఆలయంలోనూ లేని విధంగా గ్రహణ సమయంలో ఆలయం తెరుచుకుని విశేష పూజలు జరుపుకొనే ఆలయం ఒకటి ఉందని మీకు తెలుసా? మరి ఆ ఆలయం ఏమిటి ఆ ఆలయ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని శ్రీ కాళహస్తి పట్టణం ఉంది. ఈ పట్టణంలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున ప్రాచీనమైన ఆలయం ఉంది ఈ ఆలయంలో స్వామివారి స్వయంభూగా వెలిసి శ్రీకాళహస్తి ఈశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు.పంచభూతలింగములలో నాల్గవదైన వాయులింగం గల గొప్ప శైవక్షేత్రం.

ఇక్కడ ఆలయంలో రెండు దీపాలతో ఒకటి ఎప్పుడు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. మరొకటి ఎంతో నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది. ఈ విధంగా గాలికి దీపం రెపరెపలాడే దీపం ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు వాయులింగం అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పవచ్చు. దేశంలో ఏ ఆలయంలో లేనివిధంగా ఆలయంలో రాహుకేతువులు ఉండటం వల్ల గ్రహణ సమయంలో ఈ ఆలయంలో రాహుకేతువులకి పెద్ద ఎత్తున పూజలు నిర్వహిస్తారు. అందుకోసమే గ్రహణ సమయంలో ఈ ఆలయాన్ని మూసి వేయరు.గ్రహణం తరువాత ఈ ఆలయాన్ని దర్శిస్తే ఎలాంటి దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment