రుతు పవనాలు, అల్పపీడనాలు, ద్రోణుల కారణంగా దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అనేక చోట్ల వర్షాలు పెను విధ్వంసాలను సృష్టిస్తున్నాయి. నిన్న కాక మొన్న యూపీ, రాజస్థాన్లలో పిడుగులు పడి ఏకంగా 87 మంది మృతి చెందారు. ఇక తాజాగా గుజరాత్లోనూ భారీ వర్షాలు కురుస్తూ పిడుగులు పడుతున్నాయి.
మంగళవారం మధ్యాహ్నం గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలో ఉన్న ద్వారకాధీష్ ఆలయంపై పిడుగులు పడ్డాయి. దీంతో ఆలయ గోపురంపై ఉన్న జెండా దెబ్బ తిన్నది. పిడుగు నేరుగా ఆ జెండా మీదే పడింది. అయితే ఆ పిడుగు వల్ల ఆలయానికి ఎలాంటి నష్టం జరగలేదు. ఆ సమయంలో ఆలయంలో, చుట్టు పక్కల కొందరు భక్తులు ఉన్నారు. కానీ ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు.
ఇక అదే సమయంలో వీడియో తీసి దాన్ని కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ క్రమంలో ఆలయంపై పిడుగు పడిన ఆ వీడియో వైరల్గా మారింది. చూస్తుంటేనే చాలా భయంగా అనిపిస్తోంది. ఈ సందర్భంగా ఆ జిల్లా పాలక విభాగం అధికారులతో కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్లో మాట్లాడారు. పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగలేదని అధికారులు మంత్రికి చెప్పారు.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…