టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా తన కస్టమర్లకు తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. కేవైసీ మోసాలు దేశంలో పెరుగుతున్న దృష్ట్యా తమ కస్టమర్లు అలర్ట్గా ఉండాలని సూచించింది. తమ కస్టమర్లకు కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తామంటూ ఎస్ఎంఎస్లు, కాల్స్ ఎక్కువగా వస్తున్నాయని, అందువల్ల ఈ విషయంలో కస్టమర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
కేవైసీ వివరాలను అప్డేట్ చేస్తామంటూ కస్టమర్లకు కొందరు ఎస్ఎంఎస్లు పంపుతున్నారని, కాల్స్ చేస్తున్నారని ఆ కంపెనీ తెలిపింది. అయితే వాటిని నమ్మకూడదని, తాము ఎప్పుడూ అలా అడగమని తెలిపింది. ఎవరైనా కేవైసీ అప్డేట్ చేస్తామని వివరాలను అడిగితే చెప్పకూడదని, ముఖ్యంగా ఓటీపీలను అస్సలు చెప్పకూడదని సూచించింది. లేదంటే సిమ్ ఫ్రాడ్ జరుగుతుందని, దీంతో డబ్బులు నష్టపోయేందుకు అవకాశం ఉంటుందని వొడాఫోన్ ఐడియా హెచ్చరికలు జారీ చేసింది.
ఇటీవలి కాలంలో ఎస్బీఐ వంటి బ్యాంకులతోపాటు పేటీఎం కస్టమర్లకు కూడా ఇలాగే కాల్స్, ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. అయితే కేవైసీ అప్డేట్ చేస్తామని ఎవరైనా చెబితే అస్సలు నమ్మకూడదు. కంపెనీలు నిజానికి కాల్ చేసి సమాచారం అడగవు. కనుక ఇలా చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…