ప్రముఖ యాపిల్ సంస్థ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్ను లాంచ్ చేసింది. ఈ ట్రాకర్స్ను ఏ వస్తువుకైనా అతికించి పెట్టినప్పుడు వాటిని మనం మిస్ చేసుకున్నా అవి ఎక్కడ ఉన్నాయో మనకు తెలియజేస్తాయి.ఈ ట్రాకర్స్ ద్వారా ఆ వస్తువులను మనం ఎంతో సులభంగా కనిపెట్టవచ్చు.ఆపిల్ కంపెనీ ఈ ట్రాకర్స్ ను సింగిల్ ప్యాక్, ఫోర్ ప్యాక్లో వీటిని అందుబాటులోకి తేనుంది. వీటికి సంబంధించిన సేల్స్ ఇండియాలో ఏప్రిల్ 30 నుంచి ప్రారంభమవుతాయి.
సింగిల్ ఎయిర్ ట్యాగ్ ట్రాకర్స్ ధర రూ 3,190 గా నిర్ణయించారు. అదేవిధంగా 4 ట్రాకర్స్ ధర రూ.10,990గా ఉంది.వీటిలో అల్ట్రా వైడ్బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల మనం మిస్ చేసుకున్న వస్తువులను తొందరగా గుర్తించగలం. అదే విధంగా ఇందులో యూ1 చిప్ను అమర్చడం వల్ల వీటిని ఐఫోన్, ఐ పాడ్, ఆపిల్ వాచ్ వంటి వస్తువులను కనిపెట్టడానికి ఉపయోగించవచ్చు.
ఈ ట్రాకర్స్ను ఐఫోన్ దగ్గరికి తీసుకు వచ్చి వీటిని కనెక్ట్ చేయడం ద్వారా ఇందులో ఉన్న ఫైండ్ మై యాప్ ద్వారా ఈ ఎయిర్ ట్యాగ్స్ ప్రస్తుత, చివరి లోకేషన్ చూడవచ్చు. కెమెరా, ఏఆర్కిట్, యాక్సెలరోమీటర్, గైరోస్కోప్ వంటి వాటి ద్వారా మనం పోగొట్టుకున్న వస్తువులను ఇవి కని పెడతాయి.నెట్ వర్క్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని యాపిల్ తెలిపింది.