ముంబైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 4వ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై పంజాబ్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. పంజాబ్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ చివరి బంతి వరకు పోరాడింది. కానీ గెలుపు పంజాబ్ను వరించింది. రాజస్థాన్పై పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలోనే పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్, దీపక్ హుడాలు రాణించారు. 50 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో రాహుల్ 91 పరుగులు చేయగా, 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో హుడా 64 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో చేతన్ శకారియా 3 వికెట్లు పడగొట్టగా, క్రిస్ మోరిస్ 2 వికెట్లు తీశాడు. రియాన్ పరాగ్కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్మెన్లలో సంజు శాంసన్ ఒక్కడే రాణించాడు. 63 బంతులు ఆడిన శాంసన్ 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 119 పరుగులు చేశాడు. చివరి వరకు శాంసన్ పోరాడాడు. కానీ అతను ఔట్ అవడంతో రాజస్థాన్ ఓటమి పాలైంది. అతని సెంచరీ వృథా అయింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా మహమ్మద్ షమీ 2 వికెట్లు తీశాడు. జై రిచర్డ్సన్, రైలీ మెరెడిత్లకు చెరొక వికెట్ దక్కింది.