---Advertisement---

ఐపీఎల్ 2021: కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై ముంబై ఇండియ‌న్స్ గెలుపు..

April 14, 2021 12:04 AM
---Advertisement---

చెన్నైలో జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 టోర్నీ 5వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ విజ‌యం సాధించింది. ముంబై నిర్దేశించిన 153 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో కోల్‌క‌తా త‌డ‌బ‌డింది. ఈ క్ర‌మంలో కోల్‌క‌తాపై ముంబై 10 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

mumbai won by 10 runs against kolkata in ipl 2021 5th match

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ముంబై ఇండియ‌న్స్ బ్యాటింగ్ చేసింది. ఈ క్ర‌మంలో ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 152 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ముంబై బ్యాట్స్‌మ‌న్ల‌లో సూర్య కుమార్ యాద‌వ్‌, రోహిత్ శ‌ర్మ‌లు రాణించారు. 36 బంతుల్లో యాద‌వ్ 7 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 56 ప‌రుగులు చేయ‌గా, 32 బంతుల్లో రోహిత్ 3 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 43 ప‌రుగులు చేశాడు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ఆండ్రు ర‌స్సెల్ 5 వికెట్లు ప‌డ‌గొట్టాడు. ప్యాట్ క‌మ్మిన్స్ 2 వికెట్లు తీయ‌గా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, ష‌కిబ్ అల్ హ‌స‌న్‌, ప్ర‌సిధ్ కృష్ణ‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

అనంత‌రం బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 142 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో నితీష్ రాణా (57 ప‌రుగులు, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుబ‌మ‌న్ గిల్ (33 ప‌రుగులు, 5 ఫోర్లు, 1 సిక్స‌ర్‌)లు మాత్ర‌మే ఆక‌ట్టుకున్నారు. మిగిలిన ఎవ‌రూ రాణించ‌లేదు. ముంబై బౌల‌ర్ల‌లో రాహుల్ చాహ‌ర్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ట్రెంట్ బౌల్ట్ 2 వికెట్లు తీశాడు. క్రునాల్ పాండ్యాకు 1 వికెట్ ద‌క్కింది.

Bhavanam Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now