YSRCP : టీడీపీపై అనర్హత వేటు వేయించే దిశ‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నాలు..!

YSRCP : ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించిన విష‌యం విదిత‌మే. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగి మూడు రోజులు అవుతోంది. దీంతో ప్ర‌స్తుతం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఢిల్లీలో బిజీ బిజీగా ఉన్నారు. టీడీపీపై అన‌ర్హ‌త వేటు వేయించే దిశ‌గా వారు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆర్టికల్ 356ను అమలు చేయడం ద్వారా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్‌ చేస్తూ చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి కోవింద్‌ను క‌లిశారు. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కూడా క‌ల‌వాల్సి ఉండ‌గా.. ఆయ‌న అపాయింట్‌మెంట్ ల‌భించ‌లేదు.

రాష్ట్రంలో జరుగుతున్న గంజాయి వ్యాపారంపై సమగ్ర విచారణతో పాటు, గత వారం టీడీపీ కార్యాలయాలు, నాయకులపై వైఎస్సార్‌సీ నేతలు, కార్యకర్తలు చేసిన విధ్వంసంపై సీబీఐ విచారణ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్రపతిని చంద్ర‌బాబు కోరారు. అయితే వైఎస్సార్‌సీపీ నేతలు ప్ర‌స్తుతం ఎదురుదాడికి దిగారు. టీడీపీపై ఫిర్యాదు చేసేందుకు గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం భారత ఎన్నికల సంఘాన్ని కల‌వ‌నుంది.

ముఖ్యమంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున టీడీపీని రాజకీయ పార్టీగా అనర్హ‌మైన‌దిగా ప్రకటించాలని వైఎస్సార్సీ ఎంపీలు ఈసీని అభ్యర్థించనున్నారు. టీడీపీ నేతలు జగన్‌ను పరుష పదజాలంతో దూషించిన వీడియోలను అందజేసి టీడీపీ గుర్తింపు రద్దు చేయాలని కోర‌నున్నారు.

వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తోపాటు కేంద్రంలోని ఇతర అగ్రనేతలను కూడా కల‌వ‌నున్నారు. ఇప్ప‌టికే అమిత్‌షాను క‌లిసిన వారు ఈ వివ‌రాల‌న్నింటినీ తెలిపారు. ఈ క్ర‌మంలో అధికార పార్టీపై టీడీపీ బురదజల్లుతోంద‌ని వైకాపా నేత‌లు కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు తెలియ‌జేస్తున్నారు.

రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యకు కారణం చంద్రబాబునాయుడేనని వైసీపీ నేతలు చెప్పబోతున్నారు. ఆయ‌న‌ను రాజకీయాల నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కోరేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి వైసీపీ నేత‌ల ప్ర‌య‌త్నాలు ఏ మేర ఫ‌లిస్తాయో చూడాలి.

Share
IDL Desk

Recent Posts

డీమోంట్ కాల‌నీ 2 ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది.. ఎక్క‌డ, ఎప్పుడు అంటే..!

హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విష‌యం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…

Thursday, 19 September 2024, 1:55 PM

పొలంలో రైతుకి దొరికిన రూ.5ల‌క్షల విలువైన వ‌జ్రం.. ఏకంగా జాక్ పాట్ త‌గిలిందిగా..!

ఒక్కోసారి ఎవ‌రిని ఎప్పుడు అదృష్టం ఎలా వ‌రిస్తుందో తెలియ‌దు. ఊహించ‌ని విధంగా ల‌క్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…

Wednesday, 18 September 2024, 10:46 AM

భ‌ర్త రోజూ స్నానం చేయ‌డం లేద‌ని ఏకంగా విడాకులు కోరిన భార్య‌

ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొన‌సాగ‌డం లేదు. ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండ‌గా,ఆ పెళ్లి…

Wednesday, 18 September 2024, 9:12 AM

అక్క‌డ కేవ‌లం స్విచ్‌ల‌ను ఆన్, ఆఫ్ చేయ‌డ‌మే ప‌ని.. జీతం రూ.30 కోట్లు.. ఎవ‌రికి జాబ్ కావాలి..?

ఒక‌టి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన ప‌ని ఏమి లేదు. స్విచ్…

Tuesday, 17 September 2024, 6:04 PM

పెట్రోల్ పంప్‌ల‌లో మోసం.. వాహ‌న‌దారులు ఈ టిప్స్ తెలుసుకుంటే మంచిది..

దేశంలో వాహ‌నాల వినియోగం ఎంత‌గా పెరుగుతుందో మ‌నం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండ‌డంతో…

Tuesday, 17 September 2024, 3:15 PM

పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్.. రూ.5ల‌క్ష‌లు పెట్టుబ‌డితో రూ.15 ల‌క్షల రాబ‌డి..

రిస్క్ చేయ‌కుండా మంచి ప్రాఫిట్ పొందాల‌ని అనుకునేవారు ఎక్కువ‌గా పోస్టాఫీస్‌పై ఆధార‌ప‌డుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…

Tuesday, 17 September 2024, 11:11 AM

Devara Ticket Prices : అభిమానుల‌కు భారీ షాకిచ్చిన దేవ‌ర టీమ్‌.. టిక్కెట్ల రేట్ల‌ను భారీగా పెంచారుగా..!

Devara Ticket Prices : యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం త‌ర్వాత న‌టించిన చిత్రం దేవ‌ర‌. కొర‌టాల శివ…

Monday, 16 September 2024, 6:57 AM

చావు బ‌తుకుల్లో ఉన్న అభిమాని.. ఫోన్ చేసి ధైర్యం చెప్పిన ఎన్‌టీఆర్‌..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సంపాదించుకున్నారు జూనియ‌ర్ ఎన్టీఆర్ . ఆయన…

Monday, 16 September 2024, 6:55 AM