Upasana : ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియడం లేదు. చాలా మంది పనిగట్టుకుని మరీ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ తారలు.. వారి కుటుంబాలకు చెందిన వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే వీటిల్లో ఫేక్ వార్తలే ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో రామ్చరణ్, ఉపాసనల గురించి కూడా కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. ముఖ్యంగా వారు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. అందుకు కారణం కూడా ఉందని.. అనేక మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలపై ఉపాసన స్పందించింది.
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్తో ఉపాసన మాట్లాడింది. మీరు పిల్లల్ని కనడం లేదంటే అందుకు మిమ్మల్ని అభినందించవచ్చు.. అని ఆయన అన్నారు. అయితే ఈ వార్తలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉపాసన తెలియజేసింది. సద్గురు అన్న వ్యాఖ్యల ఉద్దేశం వేరని.. అంతేకానీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదని ఉపాసన స్పష్టం చేసింది.
సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసన దంపతులు పిల్లల్ని కనొద్దని నిర్ణయించుకున్నారని.. జనాభా పెరిగిపోవడం వల్లే వారు ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే వాటిని చూసిన ఉపాసన ఇలా స్పందించింది. ఇదేదీ నిజం కాదు, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మకండి, నా కామెంట్స్ను మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు, దయచేసి ఆ రోజు సద్గురుతో నేను ఏం మాట్లాడానో మరొకసారి ఆ వీడియోలో చూసి తెలుసుకోండి, ఫేక్ న్యూస్ను ప్రచారం చేయకండి.. అంటూ ఉపాసన పోస్ట్ పెట్టింది.
ఇలా ఉపాసన పోస్ట్ పెట్టడంతో వారు పిల్లల్ని కనేందుకు సిద్ధంగానే ఉన్నట్లు స్పష్టమైంది. కానీ మరి 10 ఏళ్లు అవుతున్నా ఇంత వరకు ఆ కలను వారు ఎందుకు నిజం చేసుకోలేదు.. అన్న ప్రశ్న మాత్రం మళ్లీ ఉత్పన్నమవుతోంది. అయితే దీనికి మళ్లీ ఆమె సమాధానం చెబుతుందో.. లేదో.. చూడాలి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…