టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింగర్ హరిణి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. సింగర్ హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం బెంగళూరు రైలు పట్టాలపై కనిపించడంతో అతని మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏకే రావు సుజన్ ఫౌండేషన్లో సీఈవోగా ఉన్నారు. వీరి కుటుంబం హైదరాబాద్లో నివసించే వారు.
గత వారం రోజుల నుంచి వీరి కుటుంబ సభ్యులు ఎవరూ కనిపించకపోవడంతో బంధువులు వీరికి ఫోన్ చేసినప్పటికీ స్విచాఫ్ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం హరిణి తండ్రి ఏకే రావు మృతదేహం రైలు పట్టాలపై కనిపించడంతో ఇది ఆత్మహత్య కాదని హత్య అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆయన శరీరంపై గాయాలు ఉండటంతో ఎవరో హత్య చేశారని భావిస్తున్నారు.
అయితే గత వారం రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కుటుంబ సభ్యులు ఏమయ్యారు ? వీరందరూ ఎక్కడికి వెళ్లారు ? వీరి కుటుంబంలో ఏవైనా మనస్పర్థలు వచ్చాయంటూ.. అంటూ.. వివిధ రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇలా వారం రోజులపాటు కనిపించకుండాపోవడంతో ఈ కుటుంబంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో.. ఇది హత్యా లేక ఆత్మహత్యా.. అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.