Samantha : సమంత, నాగ చైతన్య విడాకుల ప్రకటన అనంతరం ఎవరి జీవితాలలో వారు బిజీగా ఉన్నారు. విడాకుల ప్రకటన చేసిన తర్వాత నాగచైతన్య తన పనులలో బిజీగా ఉండగా సమంత మాత్రం తన స్నేహితులతో కలిసి పలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు, విదేశాలకు వెళుతూ తనలో ఉన్న బాధను మరచిపోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే చైతన్యతో తనకున్న ఒక్కొక్క జ్ఞాపకాలను తొలగిస్తున్న సమంత తాను ఉండబోయే ఇంటి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైతన్యతో సమంత కలిసి దిగిన ఫోటోలను డిలీట్ చేయడంతో సమంత పూర్తిగా చైతన్య జ్ఞాపకాలను తుడి చేస్తుందని అందరూ భావించారు. కానీ సమంత మాత్రం ఇదివరకు చైతన్యతో కలసి ఉన్న ఇంటిలోనే ప్రస్తుతం ఉండాలని నిర్ణయించుకున్నట్లు తాజా పోస్టు ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా సమంత మార్నింగ్ మ్యాడ్నెస్ అంటూ తన రెండు కుక్క పిల్లలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
అలాగే ‘న్యూ బ్రింగింగ్ బ్యాక్’ పేరిట గతంలో తాను చైతన్యతో కలసి ఉన్న ఇంటికి సంబంధించిన కొన్ని మూమెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ పోస్టు చూస్తుంటే సమంత ఇకపై ఈ ఇంటిలోనే నివసించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చైతన్య విషయానికి వస్తే గత ఏడాది జూబ్లీహిల్స్ లో ఒక విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశాడు. ఇకపై ఆ భవనంలోనే ఒంటరిగా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.