IPL 2021 : దుబాయ్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2021 టోర్నీ 45వ మ్యాచ్లో పంజాబ్ గెలుపొందింది. కోల్కతా నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ సునాయాసంగానే ఛేదించింది. ఈ క్రమంలో కోల్కతాపై పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా ఫీల్డింగ్ చేయగా కోల్కతా బ్యాటింగ్ చేపట్టింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా 7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కోల్కతా బ్యాట్స్మెన్లలో వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి మాత్రమే రాణించారు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. 49 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్తో వెంకటేష్ అయ్యర్ 67 పరుగులు చేయగా, 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్తో రాహుల్ త్రిపాఠి 34 పరుగులు చేశాడు. అలాగే 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో మరో బ్యాట్స్మన్ నితీష్ రాణా 31 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా, రవి బిష్ణోయ్ 2 వికెట్లు తీశాడు. మహమ్మద్ షమీకి 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన పంజాబ్ సులభంగానే లక్ష్యాన్ని ఛేదించింది. 19.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్మెన్లలో కేఎల్ రాహుల్ 55 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, మయాంక్ అగర్వాల్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 40 పరుగులు చేశాడు. మిగిలిన ఎవరూ ఆకట్టుకోలేదు. కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, శివమ్ మావి, సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్లకు తలా 1 వికెట్ దక్కింది.