Nikesha Patel : ఒకప్పటి రోజుల్లో సినిమా 100 రోజులు థియేటర్లో ఆడిందంటే ఆ సినిమాను సూపర్ హిట్ సినిమాగా గుర్తించేవారు. కంటెంట్ బాగుంటే సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ని అందుకునేది. కానీ ఇప్పటి రోజుల్లో ఒక చిత్రం కంటెంట్ ఎంత బాగున్న కూడా థియేటర్లలో మూడు, నాలుగు వారాల కన్నా ఎక్కువ ఉండటం లేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్ మించి కలెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే దాని సక్సెస్ ఫుల్ చిత్రంగా లెక్క కడుతున్నారు.
ఇక ఓవరాల్ కలెక్షన్స్ ని లెక్క పెట్టేసి ఓటీటీకి విక్రయిస్తున్నారు దర్శకనిర్మాతలు. మొదటి వారాల్లోనే తప్ప ఆ తర్వాత చిత్రం విడుదలైన సంగతి కూడా దాదాపు అందరూ మర్చిపోతున్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ గురించి మాట్లాడుకోవడం విశేషం. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది మార్చి 24న విడుదలైంది. అంటే సినిమా విడుదలై దాదాపు ఆరు నెలలు అయిపోయింది. కానీ ఈ సినిమాని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. హీరోలు ఇద్దరు కూడా తమ అద్భుతమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందారు.
ఈ సినిమా ఎంత ప్రేక్షకాదరణ పొందిన సినిమా అయినా కూడా కొంత మందికి నచ్చకపోవచ్చు. కాకపోతే ఈ విషయాన్ని బహిరంగంగా చర్చించడానికి కొంత మంది సంకోచిస్తారు. కానీ పులి చిత్రంలో పవన్ కళ్యాణ్ కు జోడిగా నటించిన హీరోయిన్ నిఖిషా పటేల్ మాత్రం ఎటువంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చేసింది. సోషల్ మీడియా ద్వారా.. తాను ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని, తనకు ఆ సినిమా నచ్చలేదని ట్వీట్ చేసింది. చూసిన ప్రతి సినిమా అందరికీ నచ్చాలని ఏమీ లేదని, ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. నాకు నచ్చలేదు అని చెప్పాలనిపించి చెప్పేశా.. అని తన అభిప్రాయాన్ని ట్వీట్లో నిఖిషా పేర్కొంది.
ఈ ట్వీట్ చూసిన ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు ఊరుకుంటారా.. నిఖిషాను ఆడుకోవడం మొదలు పెట్టారు. నీకు నచ్చకపోతే ఇప్పుడు ఎవడికి కావాలి. నీ అభిప్రాయం ఎవడు అడిగాడు. నీకు నచ్చితే ఎంత నచ్చకపోతే ఎంత అంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ నిఖిషాను కామెంట్స్ రూపంలో ఆడుకోవడం మొదలు పెట్టారు. అంతేకాకుండా నిఖిషా పటేల్ అటెన్షన్ కోసమే ఈ విధంగా ట్వీట్ చేసిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. నిఖిషా పటేల్ బ్రిటిష్ సిటిజన్ కాబట్టే ఆమెకు ఈ సినిమా నచ్చలేదని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
నిఖిషా పటేల్ పవన్ కళ్యాణ్ సరసన పులి చిత్రంలోనూ, హీరో కళ్యాణ్ రామ్ సరసన ఓం 3డి చిత్రంలోనూ నటించింది. ఈ చిత్రాలు రెండూ కూడా ఆమెకు మంచి గుర్తింపు తీసుకురాలేదు. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా కనిపించలేదు నిఖిషా. దాదాపు తెలుగు ప్రజలందరూ కూడా నిఖిషా అనే హీరోయిన్ ఉందనే సంగతి కూడా మర్చిపోయారు. ఇప్పుడు నిఖిషా పటేల్ ఈ ఒక్క ట్వీట్ ద్వారా అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…