Siddharth : సమంత విడాకుల విషయం బయటకు రాగానే నటుడు సిద్ధార్థ్ తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నాడు. జీవితంలో ఒకరిని మోసం చేసినవారు ఎప్పటికీ బాగుపడరు.. అంటూ సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే సమంత అభిమానులు సిద్ధార్థ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు సిద్ధార్థకు బుద్ధుందా.. ఏ సమయంలో ఎలాంటి కామెంట్ చేయాలో తెలియదా.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చెప్పాలి అనుకుంటే సిద్ధార్థ తన మాజీ భార్య గురించిన విషయాలను బయటకు తేవాలంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు సమంతను నిందించే అర్హత సిద్ధార్థకు లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో సిద్ధార్థ్, సమంత నటించిన జబర్దస్త్ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడిందని.. ఆ ప్రేమ కారణంగానే పెళ్లి చేసుకోవాలని భావించి శ్రీ కాళహస్తిలో ప్రత్యేక పూజలు చేసి చివరి నిమిషంలో విడిపోయారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కాగా సిద్ధార్థతో విడిపోయి చైతన్యను పెళ్లి చేసుకొని చివరికి చైతూకు విడాకులు ఇచ్చిన సందర్భంలో సిద్ధార్థ్ ఈ విధమైన కామెంట్ చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ధార్థ్ ఇకపై ఈ విధమైన ట్వీట్స్ చేయడం మానుకోవాలి.. అంటూ అభిమానులు హెచ్చరిస్తున్నారు.