Nagarjuna : నాగచైతన్య, సమంతలు అక్టోబర్ 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం విదితమే. వీరి నిర్ణయంతో యావత్ సినీ ప్రపంచం ఉలిక్కి పడింది. అభిమానులు షాక్ తిన్నారు. టాలీవుడ్ క్యూట్ కపుల్గా పేరొందిన వీరు విడాకులు తీసుకోవడం ఏమిటని అందరూ ఆశ్చర్యపోయారు. వీరి విడాకుల నిర్ణయం చాలా మందికి నచ్చలేదు.
అయితే నాగచైతన్య, సమంతల విడాకులపై నాగార్జున స్పందించారు. ఓ బాలీవుడ్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ.. సంచలన విషయాలను వెల్లడించారు. అసలు సమంతనే ముందుగా విడాకులు కావాలని అడిగిందని అన్నారు.
అయితే ఉన్నట్లుండి సడెన్ గా సమంత విడాకులు ఎందుకు అడిగిందో చైతన్యకు అర్థం కాలేదని, అతను సమంత నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదని అన్నారు. అయితే విడాకుల వల్ల తన తండ్రి ఎంతగా కుమిలిపోతాడో, తన ఫ్యామిలీ పరువు ఏమైపోతుందోనని నాగచైతన్య ఆలోచించాడని, కానీ ఇద్దరికీ ఇష్టమైతే విడాకులు తీసుకోండని చెప్పానని నాగార్జున అన్నారు.
2021 న్యూ ఇయర్ వేడుకలను కూడా సమంత, చైతన్య ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. ఇంతలోనే ఏమైందో తెలియదు, సమంతనే ముందుగా విడాకులు కావాలని అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది.. అని నాగార్జున తెలిపారు.
అయితే సమంత సినిమాలు, సిరీస్లలో బోల్డ్ క్యారెక్టర్స్ చేయడం అటు చైతన్యకు, ఇటు నాగార్జునకు ఇష్టం లేదని.. అందుకనే సమంత విడాకులు తీసుకుందని అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. ఇక వారి విడాకులకు కారణం కూడా అదేనని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు.