Moto G72 : మోటోరోలా కంపెనీ మరో నూతన స్మార్ట్ ఫోన్తో మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే పలు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేసి రిలీజ్ చేసిన మోటోరోలా మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మోటో జి72 పేరిట విడుదలైన లేటెస్ట్ మోటోరోలా ఫోన్లో అనేక ఆకట్టుకునే ఫీచర్లు లభిస్తున్నాయి. ధర కూడా తక్కువగానే ఉండడం విశేషం. మిడ్రేంజ్ మార్కెట్ లక్ష్యంగా ఈ ఫోన్ను లాంచ్ చేశారు. ఇక ఇందులో అందిస్తున్న ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మోటో జి72 స్మార్ట్ ఫోన్లో 6.6 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన డిస్ ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. అలాగే దీనికి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్లో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జి99 ప్రాసెసర్ను ఏర్పాటు చేయగా.. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ లభిస్తున్నాయి. దీంట్లో హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ను ఇస్తున్నారు.
ఈ ఫోన్లో వెనుక వైపు 108 మెగాపిక్సల్ భారీ కెమెరా ఉండగా.. దీనికి తోడు అదనంగా మరో 8 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంది. అలాగే మరో 2 మెగాపిక్సల్ మాక్రో కెమెరాను ఇచ్చారు. ముందు వైపు 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ను అందిస్తున్నారు. డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.1, డ్యుయల్ బ్యాండ్ వైఫై, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఇందులో టర్బో చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. దీని వల్ల ఫోన్ వేగంగా చార్జింగ్ అవుతుంది.
ఇక మోటోరోలా మోటో జి72 స్మార్ట్ ఫోన్ మీటియోరైట్ బ్లాక్, పోలార్ బ్లూ కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా.. దీని ధర రూ.18,999గా ఉంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ను విక్రయిస్తారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్పై పలు ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో రూ.1000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఏదైనా ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా రూ.3000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తారు. జియో, మింత్రా, జీ5 నుంచి రూ.5049 విలువైన ప్రయోజనాలను పొందవచ్చు.
మన శరీరంలో ఊపిరితిత్తులు ఎంత ముఖ్యమైనవో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊపిరితిత్తులు దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ…
ఇటీవలి కాలంలో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేందుకు చాలా…
సాహో చిత్రంలో ప్రభాస్ సరసన కథానాయికగా నటించి అలరించిన శ్రద్ధా కపూర్ రీసెంట్గా స్త్రీ2 అనే మూవీతో పలకరించింది. 2018లో…
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో పడ్డాడు. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీసులకు మహిళా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…