Fish : సాధారణంగా వేటకు వెళ్లే మత్స్యకారులకు కొన్నిసార్లు ఎంతో అరుదైన, ఖరీదైన చేపలు వలలో చిక్కుతుంటాయి. ఇలా ఖరీదైన చేపలు పడినప్పుడు ఒక్కసారిగా మత్స్యకారులు లక్షాధికారులు అవుతారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మత్స్యకారుడు కూడా ఇలాగే లక్షాధికారిగా మారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేప లభించడంతో దానిని వేలంలో పెట్టారు.
ఈ క్రమంలోనే బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఈ కచ్చిడి చేపను బంగారు చేప అని కూడా పిలుస్తారు. ఈ విధంగా బంగారు వర్ణంతో ఉన్న 25 కిలోల చేపను ఏకంగా రూ.2.90 లక్షలకి ఓ పాట దారుడు దక్కించుకున్నాడు. ఇంత ఖరీదు చేసే ఈ చేప ప్రత్యేకతలు ఏమిటి అనే విషయానికి వస్తే..
ఈ చేపలలో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల బలం కోసం ఉపయోగించే మందుల తయారీలో వీటిని ఉపయోగిస్తారు. అదే విధంగా గాల్ బ్లాడర్ కు ఆపరేషన్ చేసే సమయంలో కుట్లు వేయడం కోసం ఉపయోగించే దారం తయారీలోనూ ఈ చేపను ఉపయోగిస్తారు. అదేవిధంగా ఖరీదైన వైన్ తయారు చేసే సమయంలో ఈ చేపలోని పలు భాగాలను ఉపయోగించడం వల్ల ఈ చేపకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. అందుకనే ఈ చేప అంతటి ధర పలికింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…