Jio : టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన వినియోగదారులకు షాకిచ్చింది. చార్జిలను భారీగా పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఇతర టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు చార్జిలను పెంచాయి. దీంతో అదే బాటలో జియో కూడా చార్జిలను పెంచినట్లు తెలిపింది. ఇకపై పెంచిన చార్జిలను వసూలు చేయనున్నారు. మొత్తం ప్లాన్లపై 21.3 శాతం మేర చార్జిలను పెంచినట్లు జియో తెలియజేసింది.
కాగా జియోఫోన్ యూజర్లు బేస్ ప్లాన్కు గాను ఇకపై రూ.91 చెల్లించాలి. అలాగే ఇతర వినియోగదారులు బేస్ ప్లాన్ కోసం ఇకపై రూ.155 చెల్లించాలి. ఇందులో 300 ఎస్ఎంఎస్లు వస్తాయి. రోజుకు 2జీబీ డేటాను ఇస్తారు. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులుగా ఉంది.
ఇక పెంచిన ప్రీపెయిడ్ ప్లాన్ల చార్జిలను డిసెంబర్ 1వ తేదీ నుంచి అమలు చేస్తామని జియో ప్రకటించింది. మరిన్ని వివరాలకు కింద ఇచ్చిన చార్ట్ను చూసి పెంచిన చార్జిల వివరాలను తెలుసుకోవచ్చు.