కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్రమం చురుగ్గా కొనసాగుతోంది. అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అందరినీ కలవరపెడుతోంది. అయినప్పటికీ వ్యాక్సిన్ల పంపిణీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే దేశంలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ లను ప్రజలకు ఇస్తున్నారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ను బ్రిటన్కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా కంపెనీలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కోవాగ్జిన్ను దేశంలోని భారత్ బయోటెక్ సంస్థ రూపొందించింది.
కాగా కోవిషీల్డ్, కోవాగ్జిన్లను ప్రస్తుతం భారత్ ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా 1 లక్ష డోసుల కోవాగ్జిన్ టీకాలను పరాగ్వేకు పంపించారు. ఆ డోసులను ఆ దేశం స్వీకరించింది. ఈ వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మేడిన్ ఇండియా వ్యాక్సిన్ పరాగ్వేకు చేరుకుందని తెలిపారు.
పరాగ్వేలో ఇప్పటి వరకు 2,09,000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 4063 మంది అక్కడ చనిపోయారు. భారత్ కేవలం పరాగ్వేకు మాత్రమే కాకుండా ఇప్పటి వరకు పలు ఇతర దేశాలకు కూడా కోవిడ్ టీకా డోసులను పంపిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 638.81 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ ఇతర దేశాలకు పంపించింది.
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…
నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా తనదైన గుర్తింపు తెచ్చుకొని అశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ . ఆయన…