గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. ఉజ్వల పథకం కింద లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లను అందించే కార్యక్రమానికి మోడీ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా పీఎంయూవై పథకం కింద కోటి గ్యాస్ కనెక్షన్లను ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలో మహోబా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకం కింద ఉజ్వల 2.0 ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లతోపాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ ప్లేట్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో చేరడానికి సరైన ఆధారాలు అవసరమే. కానీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లిన వారికి ఎలాంటి ఆధార పత్రాలు లేకుండా గ్యాస్ కనెక్షన్లను అందించనుంది.
ఈ క్రమంలోనే మొట్టమొదటిసారిగా ఉజ్వల పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే1, 2016న ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. ఎవరైతే దారిద్ర్యరేఖకు దిగువన ఉంటారో అలాంటి మహిళల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలోనే మొదటిదశలో భాగంగా 1,47,43,862 LPG కనెక్షన్లను తీసుకున్నారు. అయితే ఈ పథకానికి ఏవిధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు విషయానికి వస్తే.. కేవలం మహిళల పేరు మీద మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి అప్లై చేసుకునే వారు 18 సంవత్సరాలు పైబడిన వారే ఉండాలి. ఈ మహిళలు తప్పనిసరిగా దారిద్ర రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే అర్హులు. అదేవిధంగా ఇంట్లో ఏ కుటుంబ సభ్యులకి కూడా గ్యాస్ కనెక్షన్ లేకపోతేనే ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే…
హారర్ సినిమా ప్రేమికుల్లో 'డీమాంటీ కాలనీ' సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినిమాయే అయినప్పటికీ...…
ఒక్కోసారి ఎవరిని ఎప్పుడు అదృష్టం ఎలా వరిస్తుందో తెలియదు. ఊహించని విధంగా లక్షాధికారి అవుతుంటారు. తుగ్గలి మండలం సూర్యతాండాలో రైతుకూలీకి…
ఈ రోజుల్లో బంధాలు ఎక్కువ కాలం కొనసాగడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి ఎంతో అట్టహాసంగా పెళ్లి చేసుకుంటుండగా,ఆ పెళ్లి…
ఒకటి కాదు రెండు కాదు, మూడు కాదు ఏకంగా ముప్పై కోట్ల జీతం. చేయాల్సిన పని ఏమి లేదు. స్విచ్…
దేశంలో వాహనాల వినియోగం ఎంతగా పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రోజు రోజుకి వాహనాల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో…
రిస్క్ చేయకుండా మంచి ప్రాఫిట్ పొందాలని అనుకునేవారు ఎక్కువగా పోస్టాఫీస్పై ఆధారపడుతుండడం మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం పోస్టాఫీసులో మంచి…
Devara Ticket Prices : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత నటించిన చిత్రం దేవర. కొరటాల శివ…